Stand Up Rahul: ప్రచార చిత్రాలను చూస్తేనే తెలుస్తోంది.. కథ ఎంత బాగా తెరకెక్కిందో: వరుణ్‌ తేజ్‌

‘స్టాండప్‌ రాహుల్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన వరుణ్‌తేజ్‌. రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది.

Published : 16 Mar 2022 23:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్‌తరుణ్‌ హీరోగా స్టాండప్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. ‘కూర్చుంది చాలు!!’ అనేది ఉప శీర్షిక. వర్ష బొల్లమ్మ కథానాయిక. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించింది. నటుడు వరుణ్‌తేజ్‌, దర్శకులు అనిల్‌ రావిపూడి, సాగర్‌ కె. చంద్ర తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘శాంటోకు సినిమా అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే యూకేలో మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడికొచ్చాడు. ఈ సినిమాను ప్రారంభించకముందు ఓసారి ‘స్టాండప్‌ రాహుల్‌’ కథను నాకు వినిపించాడు. ఆ కథను ఎంత బాగా తెరకెక్కించాడో ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఈ కథలోని నాయకానాయికల పాత్రలకు రాజ్‌తరుణ్‌, వర్ష సరిగ్గా సరిపోయారు. రాజ్‌ తరుణ్‌ నేనూ ఒకే సమయంలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాం. తను వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. ‘స్టాండప్‌ రాహుల్‌’ తనకు తొలి చిత్రమనిపించేంత యంగ్‌గా కనిపిస్తున్నాడు. వర్ష నటించిన ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ సినిమా ఇటీవల చూశా. ఆమె నటన అద్భుతం. సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని