Veera Simha Reddy: ముగించారు ‘వీరసింహారెడ్డి’

సంక్రాంతి బరిలో ‘వీరసింహారెడ్డి’గా వినోదాలు పంచనున్నారు నందమూరి బాలకృష్ణ.

Updated : 08 Dec 2022 06:56 IST

సంక్రాంతి బరిలో ‘వీరసింహారెడ్డి’గా (Veera Simha Reddy) వినోదాలు పంచనున్నారు నందమూరి బాలకృష్ణ (Balakrishna). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. దునియా విజయ్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయింది. ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయ’’ని నిర్మాతలు తెలిపారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకి తమన్‌ స్వరాలందిస్తున్నారు. రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని