Veera Simha Reddy: వీరసింహారెడ్డి కథ కాదు.. ఓ ప్రయాణం
‘‘నటుడిగా భిన్న రకాల పాత్రలు చేసే అవకాశం లభించిందంటే అది ఈ జన్మకి నాకు లభించిన అదృష్టం. ఇంకా కుర్రాడిలా కనిపించడం వెనక అదే రహస్యం’’ అన్నారు నందమూరి బాలకృష్ణ.
- విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ
‘‘నటుడిగా భిన్న రకాల పాత్రలు చేసే అవకాశం లభించిందంటే అది ఈ జన్మకి నాకు లభించిన అదృష్టం. ఇంకా కుర్రాడిలా కనిపించడం వెనక అదే రహస్యం’’ అన్నారు నందమూరి బాలకృష్ణ (Balakrishna). ఆయన కథానాయకుడిగా నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) విజయోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్లో జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన చిత్రమిది. బాలకృష్ణకి జోడీగా శ్రుతిహాసన్ (Shruti Haasan), హనీరోజ్ (Honey Rose) నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా ‘వీరమాస్ బ్లాక్బస్టర్’ పేరుతో విజయోత్సవాన్ని నిర్వహించారు. యువ కథానాయకులు విష్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డతోపాటు దర్శకులు హరీష్శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకని ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక్కొక్కసారి ఒక్క డైలాగ్ నుంచి, ఒక్క మేనరిజమ్ నుంచే కథ పుడుతుంటుంది. దీనికి ఆద్యుడు మా బోయపాటి శ్రీను. గోపీచంద్ మలినేని నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాం. అప్పుడే సీమ రక్తం కుతకుతలాడుతోందని అన్నా. నా అభిమాని కాబట్టి గోపీచంద్ మలినేని వెంటనే ‘చెన్నకేశవరెడ్డి’ అన్నాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో అద్భుతమైన కథ చేశాడు. ఇది కథ కూడా కాదు, ఇదొక ప్రయాణం. తెలుగు ప్రేక్షకులతోపాటు, ఇతర భాషలకి చెందిన అభిమానులు కూడా ఈ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. మాటల్లోనూ, పాటల్లోనూ అద్భుతమైన పనితీరు కనబరిచారు సాయిమాధవ్ బుర్రా, రామజోగయ్యశాస్త్రి. తమన్ సంగీతం అద్భుతంగా ఉంది. ఒకొక్క పాట నా ఆహార్యానికి సరిపడేలా ఉంటుంది. ఇదొక విస్ఫోటనం అని చెప్పా. అన్నట్టుగానే ఈ సినిమా గొప్ప విజయం సాధించింది’’ అన్నారు.
* కథానాయకుడు విష్వక్సేన్ (Vishwak Sen) మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఏం సాధించావని అడిగితే... ‘బాలకృష్ణ సర్’ ప్రేమని సాధించానని చెబుతా. ఆయన కోసం కొత్త అభిమానులు పుడుతున్నారు. అందరికీ జరగదు అది’’ అన్నారు.
* సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) మాట్లాడుతూ ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. మన దగ్గర మంచి సినిమాతోపాటు, హిట్ సినిమా కూడా తీయాలి. గాడ్ ఆఫ్ మాసెస్ అనే పేరున్న బాలకృష్ణతో సినిమా తీయాలంటే అది ఎంత కష్టమో. ఒక మేజిక్ని సృష్టించాలి. దర్శకుడు గోపీ అద్భుతంగా ఆ మేజిక్ని సృష్టించారు’’ అన్నారు.
* గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో బాలకృష్ణతో ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఇంత మంచి అవకాశాన్నిచ్చిన కథానాయకుడు బాలకృష్ణకి రుణపడి ఉంటా. ఒక అభిమానిగా ఈ సినిమా చేశా. ఫ్యాన్ మూమెంట్స్, ఫ్యామిలీ మూమెంట్స్ ఇందులో ఉన్నాయి. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులవల్లే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది’’ అన్నారు.
* ‘‘ఈ చిత్ర విజయంలో నేను భాగం కావడం, మీనాక్షి పాత్ర దొరకడం గొప్ప వరం’’ అన్నారు హనీరోజ్ (Honey Rose).
* ‘అఖండ’ సినిమా నుంచి బాలకృష్ణే నా జీవితానికి శివుడు. ఆ సినిమా చేస్తున్నప్పుడు రోజూ లింగపూజ చేస్తూ ఆ సినిమాకోసం కష్టపడ్డాను. ఆ సినిమాలో నటిస్తూ ఆయన పడిన కష్టాన్ని గుర్తించి ఈ సినిమాకి పనిచేశా. బాలకృష్ణ నిజమైన మనిషి, ఆయన కోసం అందరం నిజంగానే పనిచేస్తుంటాం. చాలామందికి పనిచేయాలనుకుంటాం. రజనీకాంత్, బాలకృష్ణ, చిరంజీవిలకి పనిచేయడం మాకు పెద్ద బహుమానం’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్ (Thaman).
* ‘‘బాలకృష్ణ ‘అఖండ’ తర్వాత మాకు ఈ సినిమా అవకాశం ఓ పెద్ద బాధ్యత. ఇంత మంచి సినిమానిచ్చిన కథానాయకుడు, దర్శకులకి కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాత నవీన్ యెర్నేని.
* సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ‘‘ఇంత విజయం సాధిస్తుందని, ఇన్ని సంచలనాలు సాధిస్తుందని మాస్ కమర్షియల్ సినిమా దొరికితే ఎలా రాయగలనో చూపించాలనే తపన ఉండేది. ఇంత అద్భుతమైన కథ, సన్నివేశాల్ని ఇచ్చి మాటలు రాసే అవకాశాన్నిచ్చిన గోపీకి కృతజ్ఞతలు’’ అన్నారు.
* రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘సినిమా విజయంలో సింహభాగం వాటా పాటలకి దక్కింది. ఇంత గొప్ప విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.
* ‘‘ఇంత పెద్ద సినిమాలో నన్ను భాగం చేయడంతోపాటు, నటిస్తున్నప్పుడు నాకు ప్రోత్సాహం అందించిన బాలకృష్ణకి కృతజ్ఞతలు. ఓ సన్నివేశంలో ఆయన్ని పొడవాలన్నప్పుడు నాకు భయమేసింది... అభిమానులు ఎలా స్వీకరిస్తారో అని! కానీ నా అభిమానులు పాత్రలానే చూస్తారంటూ ధైర్యం చెప్పారు బాలకృష్ణ. అందుకే ఆయన పక్కన అంత బాగా నటించగలిగా’’ అన్నారు వరలక్ష్మి శరత్కుమార్ (Varalakshmi Sarathkumar).
* హరీష్శంకర్ (Harish Shankar) మాట్లాడుతూ ‘‘సంక్రాంతి పండగని కొనసాగిస్తోంది ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా తొలి షాట్కి నేను దర్శకత్వం చేశా. త్వరలోనే బాలకృష్ణ సర్ని ఒప్పించి మంచి కథతో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు.
* అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ ‘‘ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ సీజన్ నడుస్తోంది. ఆయనదైన టచ్తోనే ‘వీరసింహారెడ్డి’ వచ్చింది. అదే టచ్తోనే తదుపరి సినిమా రాబోతోంది. కాకపోతే ఈసారి అన్న రాయలసీమలో కాకుండా, తెలంగాణలో దిగుతాడు. ఈసారి బాక్సాఫీసు ఊచకోత షురూ చేసి, కలెక్షన్లతో ఖుర్బానీ పెడతాడు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దునియా విజయ్, రాహుల్ సాంకృత్యాన్, అజయ్ ఘోష్, సప్తగిరి, అవినాష్, జాన్, నాగమహేష్, రామ్ లక్ష్మణ్, వెంకట్, శంకర్, సచిన్ ఖేడేకర్, లాల్, బి.వి.ఎస్.రవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?