‘అరణ్య’ నుంచి ఆకట్టుకునే పాట

రానా ప్రధానపాత్రలో నటిస్తున్న ‘అరణ్య’ నుంచి మరో పాట విడుదలైంది. ‘వెళ్లు వెళ్లు వెళ్లవే అలా.. వెచ్చనైన ఊహ నువ్వలా’ అంటూ సాగే పాట మనసుకు హత్తుకునేలా ఉంది. విష్ణువిశాల్‌, జోయా హుస్సేన్‌ జంటపై ఈ పాట చిత్రీకరించారు.

Updated : 29 Jun 2023 18:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా ప్రధానపాత్రలో నటిస్తున్న ‘అరణ్య’ నుంచి మరో పాట విడుదలైంది. ‘వెళ్లు వెళ్లు వెళ్లవే అలా.. వెచ్చనైన ఊహ నువ్వలా’ అంటూ సాగే పాట మనసుకు హత్తుకునేలా ఉంది. విష్ణువిశాల్‌, జోయా హుస్సేన్‌ జంటపై ఈ పాట చిత్రీకరించారు. వనమాలి రచించగా శాంతను సంగీతం అందించారు. హరిచరణ్‌ ఆలపించారు. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన అరణ్య గీతం కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంది. కాగా చిత్రబృందం మరో పాటను విడుదల చేసింది. ప్రభుసాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. విష్ణు విశాల్‌, జోయా హస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతను సంగీతం అందించారు. ఏరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని