venky atluri: ఈ కథకీ... ‘సూపర్ 30’, ‘త్రీ ఇడియట్స్’కీ సంబంధమేమీ లేదు!
ధనుష్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘సార్’ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఈసందర్భంగా ఆయన పంచుకున్న ఆసక్తికర విశేషాలు..
‘‘మూడు ప్రేమకథలు చేశాక... ఈసారి ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనుకొన్నా. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ‘సార్’ కథ. ఒక తరహా కథలకి పరిమితం కాకుండా... అన్ని రకాల చిత్రాల్ని తెరకెక్కించడమే నాకు ఇష్టం’’ అన్నారు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ‘తొలిప్రేమ’తో మెగాఫోన్ చేతపట్టిన ఆయన... ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ చిత్రాలతో తన ప్రతిభని చాటి చెప్పారు. ఇటీవల ధనుష్ కథానాయకుడిగా ‘సార్’ తెరకెక్కించారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి పంచుకున్న విశేషాలివి..!
‘‘నా చదువులు 90వ దశకంలోనే సాగాయి. ఆ సమయంలో నాకు ఎదురైన అనుభవాలు, నేను ఎదురు చూసిన సంఘటనల్ని ఆధారంగా చేసుకునే ఈ కథ రాసుకున్నా. 90ల నాటి కథే అయినా ఇప్పటి పరిస్థితుల్నీ ప్రతిబింబిస్తుంది. ఈ కథాంశం ఎప్పుడైనా సరే, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. విడుదల తర్వాత అదే రుజువైంది. చదువుకునే పిల్లలకి ఎంతగా నచ్చిందో, వాళ్ల తల్లిదండ్రుల్నీ అంతే కదిలించింది’’
‘‘సినిమా చూశాక దర్శకులు త్రివిక్రమ్, కథానాయకులు నితిన్, వరుణ్తేజ్, నిర్మాత శిరీష్తోపాటు ఇంకా చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా చేశావని మెచ్చుకున్నారు. చెన్నైలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశా. వాళ్లు చివరి వరకు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. తెలుగులో ప్రీమియర్ షో నుంచీ బాగుందంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. కొంతమందైతే హిందీలో కూడా విడుదల చేయాల్సిందన్నారు. ఈ స్పందన చాలా తృప్తినిచ్చింది’’.
‘‘ఈ కథ రాసుకున్నాక నా మనసులో ధనుష్ తప్ప మరొకరు లేరు. ఆయనకే కథ చెప్పే అవకాశం రాగానే చాలా సంతోషించా. కథ వినగానే ఆయన చప్పట్లు కొట్టి డేట్స్ ఎప్పుడు కావాలన్నారు. ఆయన విజన్ ఉన్న నటుడు. సన్నివేశం చేస్తున్నప్పుడు ఇదెలా వస్తుందో అలవోకగా ఊహిస్తారు. ఆయనలో స్పష్టతని గమనించి చాలా నేర్చుకున్నా’’
‘‘త్రివిక్రమ్ ఆలోచనలు ఈ కథపై చాలా ప్రభావం చూపించాయి. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆయనతో సాగించిన చర్చల నుంచి పుట్టినవే. ఆయన అనుభవాల స్ఫూర్తితో రాశా. చాలా మంది పోలుస్తున్నట్టుగా ఈ కథకీ... ‘సూపర్ 30’, ‘త్రీ ఇడియట్స్’కీ సంబంధమేమీ లేదు. ‘సూపర్ 30’ కంటే ముందే రాసుకున్న కథ ఇది. ఆ సినిమా కూడా విద్య నేపథ్యంలోనే అని తెలిసి భయపడుతూ చూశా. అదొక జీవిత కథ అయితే, ఇదొక కల్పిత కథ’’.
‘‘ప్రేమకథలంటే నాకెప్పుడూ ఇష్టమే. వాటిని వదిలేస్తానని చెప్పను కానీ... ఇకపై విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. తదుపరి అందరినీ సీటు అంచున కూర్చోబెట్టే ఓ సినిమా చేయాలనుకుంటున్నా. దాని గురించి ఇప్పుడే చెప్పలేను కానీ, ‘సార్’ని ఎక్కువ మందికి చేరవేయడమే నా ముందున్న లక్ష్యం. దీనికి కొనసాగింపు ఆలోచనంటూ ఏమీ లేదు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!