Vijay Antony: బోటు ప్రమాదం.. దవడ భాగంలో తొమ్మిది ప్లేట్లు వేశారు: విజయ్‌ ఆంటోనీ

‘బిచ్చగాడు 2’ (Bichagadu 2)తో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony). మే 12న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తనకు జరిగిన ప్రమాదం గురించి మాట్లాడారు. 

Updated : 08 May 2023 19:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బిచ్చగాడు-2’ (Bichagadu 2) షూట్‌లో జరిగిన బోటు ప్రమాదం గురించి నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) మొదటిసారి మాట్లాడారు. ఆ ప్రమాదం ఎలా జరిగింది? తనకు జరిగిన సర్జరీ గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. 

‘‘బిచ్చగాడు 2’లో కొన్ని సీన్స్‌ షూట్‌ కోసం మేమంతా మలేసియాలోని లంకావి ప్రాంతానికి వెళ్లాం. లవ్‌ సాంగ్‌ షూట్‌లో భాగంగా నేనూ కావ్య ఓ జెట్‌ స్కి (Jet Ski)పై ఉన్నాం. మిగిలిన బృందం మొత్తం మరో బోట్‌పై ఉండి మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు. విజువల్స్‌ చక్కగా రావాలనే ఉద్దేశంతో నేను ఫుల్‌ స్పీడ్‌లో జెట్‌ స్కిని డ్రైవ్‌ చేస్తుండగా ఉన్నట్టుండి ప్రమాదం చోటుచేసుకుంది. నా ముఖానికి బోటు గట్టిగా తగిలింది. ముఖం మొత్తం గాయాలు, రక్తం, దవడ భాగం కిందకు జారింది. గాయాలతో నీటిలో పడిపోయాను. చిత్రబృందం నన్ను కాపాడి వెంటనే ఆస్పత్రిలో చేర్పించింది. ఆ తర్వాత రోజు నేను స్పృహలోకి వచ్చాను. నన్ను చూసి అందరూ కంగారుపడ్డారు. నా ముఖానికి తగిలిన గాయాలు కనిపించకుండా, దవడను సరిచేయడానికి సుమారు 9 ప్లేట్లు వేశారు. నెలన్నరపాటు లిక్విడ్‌ డైట్‌లోనే ఉన్నా. అందుకే ఫిజికల్‌గానూ సన్నగా అయ్యాను. ఈ ప్రమాదం వల్ల మాట్లాడేటప్పుడు కాస్త ఇబ్బందిపడుతున్నా. ఇప్పటికీ కొన్ని పదాలు స్పష్టంగా పలకలేకపోతున్నా. దవడ భాగంలో ప్లేట్లు వేయడంతో నా లుక్‌ కూడా చాలా మారింది. ‘బిచ్చగాడు-2’ సినిమా సోదరి సెంటిమెంట్‌తో తెరకెక్కింది. తప్పకుండా ఇది సూపర్‌హిట్‌ అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నా’’ అని విజయ్‌ తెలిపారు.

అనంతరం హీరోయిన్‌ కావ్య థాపర్‌ మాట్లాడుతూ.. ‘‘విజయ్‌ ఆంటోనీ గొప్ప నటుడు. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నాకెంతో ఆనందంగా అనిపించింది. బోటు ప్రమాదం జరిగినప్పుడు ఆయన్ని చూసి నేను చాలా కంగారుపడ్డాను. ఆయన ఎలా రికవరీ కాగలడు? అనిపించింది. మూడు నెలల తర్వాత మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు  షాకయ్యాను. ఆయన ముఖంపై ఒక్క గాయం కూడా కనిపించలేదు. ఆయన పూర్తిగా మారిపోయారు’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని