Vijay Devarakonda: మహేశ్ స్థానాన్ని రీప్లేస్ చేస్తోన్న విజయ్..!
పోకిరి’, ‘బిజినెస్ మెన్’ చిత్రాలతో హిట్స్ అందుకున్నారు పూరీ జగన్నాథ్-మహేశ్బాబు. రెండు విజయాల అనంతరం వీరిద్దరూ తమ హ్యాట్రిక్ ప్రాజెక్ట్గా కొన్నేళ్ల క్రితం...
పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్కి ‘లైగర్’ గ్రీన్ సిగ్నల్...!
హైదరాబాద్: ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ చిత్రాలతో హిట్స్ అందుకున్నారు పూరీ జగన్నాథ్-మహేశ్బాబు. రెండు విజయాల అనంతరం వీరిద్దరూ తమ హ్యాట్రిక్ ప్రాజెక్ట్గా కొన్నేళ్ల క్రితం ‘జన గణ మన’ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు అప్పట్లో పూరీ తెలిపారు. ఇది తన కలల ప్రాజెక్ట్ అని.. మహేశ్ని మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారని చెప్పుకొచ్చారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమాకు ఆదిలోనే ఎండ్ కార్డు పడింది. దీంతో ఆనాటి నుంచి ‘జన గణ మన’ సినిమా కోసం సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరీ-పవన్ కాంబోలో ఇది తెరకెక్కే అవకాశం ఉందని కొన్నిసార్లు వార్తలూ వచ్చాయి.
కాగా, తాజాగా వస్తోన్న సమాచారం ప్రకారం ఇంతకాలంగా నిలిచిపోయిన తన కలల ప్రాజెక్ట్ని ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కించాలనే ఉద్దేశంలో పూరీ ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఉందట. ఇప్పటికే ‘లైగర్’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైన పూరీ-విజయ్ మరోసారి ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేయనున్నారట. పూరీ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ వెంటనే ఓకే చేశారని టాక్. ఇదిలా ఉండగా, ఆదివారంతో ‘లైగర్’ షూట్ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పూరీ ఓ వాయిస్ నోట్ షేర్ చేశారు. ‘ఇప్పుడే లైగర్ షూట్ పూర్తైంది. ఈరోజుతో జన గణ మన’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఆడియో విన్న వారు విజయ్-పూరీ కాంబోలో త్వరలో ‘జన గణ మన’ వచ్చేస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.