Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ బోల్డ్‌ లుక్‌‌.. స్పందించిన అనుష్క

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా సిద్ధమవుతోన్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘లైగర్‌’ (Liger). మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది....

Published : 02 Jul 2022 13:29 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా సిద్ధమవుతోన్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘లైగర్‌’ (Liger). మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ‘లైగర్‌’ నుంచి సరికొత్త పోస్టర్‌ బయటకు వచ్చింది. చేతిలో రోజా పూలు పట్టుకుని షర్ట్‌ లెస్‌గా బోల్డ్‌ లుక్‌లో విజయ్‌ దర్శనమిచ్చారు. ‘‘ఈ సినిమా నా నుంచి అన్నీ తీసుకుంది. మానసికంగా, శారీరకంగా.. ఒక నటుడిగా ఈ రోల్‌ నాకెంతో ఛాలెజింగ్‌గా అనిపించింది. ‘లైగర్‌’తో త్వరలోనే మీకెంతో వినోదాన్ని అందిస్తా’’ అని విజయ్‌ తెలిపారు.

ఇక, నటి అనుష్క శెట్టి (Anushka Shetty) ఈ ఫొటోని షేర్‌ చేస్తూ ‘లైగర్‌’ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ‘‘లైగర్‌ టీమ్‌ మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌. ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకోవాలని కోరుకుంటున్నా. పూరీ (Puri) సర్‌ మీ మ్యాజిక్‌ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. విజయ్‌.. ఈ సినిమా నీ కెరీర్‌లో బెస్ట్‌ కావాలి. ఎన్నో విభిన్నమైన కథలు మాకందిస్తున్న ఛార్మి (Charmme), ఆ కథలు తెరకెక్కించడంలో భాగమైన కరణ్‌జోహార్‌కు(Karan Johar) ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కొత్త పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన అభిమానులు.. ‘‘చాలా తక్కువమంది నటులు మాత్రమే సినిమా కోసం ఎలాంటి బోల్డ్‌ రోల్‌నైనా ఓకే చేస్తారు. విజయ్‌ సినిమా సక్సెస్‌ కావాలి’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో సిద్ధమవుతోన్న చిత్రం ‘లైగర్‌’. ఇందులో విజయ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. పూరీ జగన్నాథ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనన్యపాండే కథానాయిక. రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తైంది. త్వరలో పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు ప్రారంభం కానున్నాయి. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడెక్షన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని