Vijay Deverakonda: విజయ్‌- పూరీ కాంబో.. మరో పాన్‌ ఇండియా చిత్రం షురూ!

పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’కు ముందే దర్శకుడు పూరి జగన్నాథ్‌- నటుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో మరో చిత్రం ఖరారైంది. ఈ ఇద్దరు ‘జనగణ మన’ అనే సినిమా కోసం మళ్లీ కలిసి చేస్తున్నారు.

Updated : 29 Mar 2022 16:12 IST

ముంబయి: పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ విడుదలకు ముందే దర్శకుడు పూరి జగన్నాథ్‌- నటుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో మరో చిత్రం ఖరారైంది. ఈ ఇద్దరు ‘జనగణ మన’ (JGM) అనే సినిమా కోసం మళ్లీ కలిసి చేస్తున్నారు. సంబంధిత వివరాలు పంచుకునేందుకు చిత్ర బృందం ప్రెస్‌ మీట్‌ నిర్వహించి, సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ను విడుదల చేసింది. సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఇందులో ఇండియా మ్యాప్‌తోపాటు, భారత సైనికుల లుక్‌లో కొందరు కనిపించారు. యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. పూరి కనెక్ట్స్‌, శ్రీకర స్టూడియోస్‌ పతాకాలపై దర్శకుడు వంశీ పైడిపల్లి, ఛార్మి నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం 2023 ఆగస్టు 3న విడుదలకానుంది. కథానాయిక, సాంకేతిక బృంద వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన ‘లైగర్‌’ 2022 ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో విజయ్‌ సరసన అనన్య పాండే సందడి చేయనుంది. ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదలవకముందే ఇదే కాంబినేషన్‌లో మరో పాన్‌ ఇండియా చిత్రం వస్తుండటం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని