VijaySethupathi: ‘విక్రమార్కుడు’ విచ్చేశాడు

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా గోకుల్‌ తెరకెక్కించిన చిత్రం ‘జంగా’. సాయేషా, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలు. కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా ‘విక్రమార్కుడు’ పేరుతో తెలుగు వారిని అలరించేందుకు సిద్ధమైంది.

Published : 07 Jul 2021 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా దర్శకుడు గోకుల్‌ తెరకెక్కించిన చిత్రం ‘జంగా’. సాయేషా, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలు. కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా ‘విక్రమార్కుడు’ పేరుతో తెలుగుప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో జులై 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ని విడుదల చేసింది ఆహా సంస్థ. ‘ఎప్పుడూ మిగతావాళ్లని కిందకి దించేసి మనం పైకి రావాలనుకోవడం తప్పు’ అనే సంభాషణతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. డాన్‌గా విజయ్‌ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. కామెడీ, యాక్షన్‌ సన్నివేశాలు సమపాళ్లలో ఉన్నాయి. మరి ఈ డాన్‌ కథేంటి? ఆయన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి సాగింది? ఇద్దరు భామల్లో ఎవర్ని ప్రేమిస్తాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని