Vijay Antony: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న విజయ్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

విజయ్‌ ఆంటోనీ హీరోగా దర్శకుడు ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘కొడియిల్‌ ఒరువన్‌’. ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది.

Published : 13 Dec 2022 20:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులు/నెలల వ్యవధిలోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ, పలు కారణాల వల్ల కొన్ని చిత్రాల ఓటీటీ రిలీజ్‌ ఆలస్యమవుతుంటుంది. ఆ కోవలోకి చేరింది ‘విజయ్‌ రాఘవన్‌’ (Vijay Raghavan). గతేడాది సెప్టెంబరులో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఈ నెల 16 నుంచి ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ కానుంది. ‘బిచ్చగాడు’ ఫేం విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా రూపొందిన చిత్రమిది. ఆనంద కృష్ణన్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో ‘కొడియిల్‌ ఒరువన్‌’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ట్యూషన్‌ మాస్టర్‌ అయిన హీరో ఐఏఎస్‌ కావాలనే ఇతివృత్తంతో రాజకీయ కోణంలో రూపొందీ సినిమా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని