VijaySethupathi: ఓటీటీలోకి ‘విజయ్‌సేతుపతి’

విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సంగతమిజన్‌’. తెలుగులో ‘విజయ్‌ సేతుపతి’ టైటిల్‌తో విడుదలైంది.

Published : 07 May 2021 16:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సంగతమిజన్‌’. తెలుగులో ‘విజయ్‌ సేతుపతి’ టైటిల్‌తో విడుదలైంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అటు కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. ఆ వినోదాన్ని మళ్లీ పంచేందుకు డిజిటల్‌ మాధ్యమం వేదికగా రానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో మే 14లో నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. విజయ ప్రొడక్షన్స్‌ పతాకంపై భారతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌ చందర్ దర్శకత్వం వహించారు. వివేక్‌ మార్విన్‌ సంగీతం అందించారు. రవి కిషన్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని