Cinema News: ‘విక్రమ్‌’ పాట.. ‘బ్రహ్మాస్త్ర’ ప్రోమో వచ్చేశాయ్‌..!

సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత వెండితెరపై మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు విశ్వనటుడు కమల్‌హాసన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేశ్‌ కనకరాజు దర్శకుడు.....

Published : 27 May 2022 14:33 IST

హైదరాబాద్‌: దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత వెండితెరపై మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు విశ్వనటుడు కమల్‌హాసన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేశ్‌ కనకరాజు దర్శకుడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో తాజాగా ‘విక్రమ్‌’ తెలుగు వెర్షన్ నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘మత్తుగా మత్తుగా’ అంటూ సాగే ఈ పాటను కమల్‌ హాసన్‌ ఆలపించారు. చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా, అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈసినిమాలో కమల్‌ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నారు. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు.

‘బ్రహ్మాస్త్ర’...!

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా సిద్ధమవుతోన్న ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’. ఆలియాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతోన్న ఈచిత్రానికి ఆయాన్‌ ముఖర్జీ దర్శకుడు. బిగ్గెస్ట్‌ యాక్షన్‌, ఫిక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం.. మొదటి భాగం: శివ’ పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈసినిమా తెలుగు వెర్షన్‌ మొదటి పాట ప్రోమోని విడుదల చేశారు. ‘కుంకుమలా’ అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా.. సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని