Vikram: అనురాగ్ వ్యాఖ్యలపై విక్రమ్ రియాక్షన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న హీరో అభిమానులు
తనని ఉద్దేశిస్తూ ఇటీవల అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా విక్రమ్(Vikram) స్పందించారు.
ఇంటర్నెట్డెస్క్: ‘కెన్నెడీ’ (Kennedy) విషయంలో తనని ఉద్దేశిస్తూ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) చేసిన వ్యాఖ్యలపై నటుడు విక్రమ్ (Vikram) స్పందించారు. అనురాగ్ తన కోసం కథ రాశారని తెలిసిన వెంటనే, తాను ఆయన్ని సంప్రదించినట్లు చెప్పారు. సుమారు ఏడాది క్రితం తమ మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ‘‘డియర్ అనురాగ్ కశ్యప్.. సోషల్మీడియాలో ఉన్న స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం సుమారు ఏడాది క్రితం మన మధ్య జరిగిన సంభాషణను ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పటికీ (ఈమెయిల్, మెస్సేజ్ల రూపంలో) నా నుంచి మీకు ఎలాంటి సమాధానం రాలేదని గతంలో మీరు ఒక నటుడితో చెప్పారు. అతడి ద్వారా విషయం తెలుసుకున్న నేను వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ఏదైతే మెయిల్ ఐడీకి సందేశాలు పంపించారో అది యాక్టివ్గా లేదని, నా మొబైల్ నంబర్ కూడా దాదాపు రెండేళ్ల క్రితమే మార్చేశానని.. అందుకే నన్ను రీచ్ కాలేకపోయారని ఆనాడే మీకు తెలిపాను. అలాగే, ‘కెన్నెడీ’ నాకెంతో నచ్చిందని అప్పుడే చెప్పాను కదా’’ అని విక్రమ్ ట్వీట్ చేశారు.
ఇక, దీనిపై అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ.. ‘‘నిజమే బాస్.. ఒక నటుడి ద్వారా విషయం తెలుసుకున్న విక్రమ్ నన్ను సంప్రదించారు. అప్పుడే మాకు కూడా తెలిసింది ఆయనకు వేరే ఫోన్ నంబర్ ఉందని. అధికారిక మెయిల్, ఫోన్ నంబర్ వివరాలను మాకు ఇచ్చారు. అలాగే, ఆయన నా స్క్రిప్ట్ చదవడానికి ఆసక్తి కనబరిచారు. కాకపోతే అప్పటికే మేము షూటింగ్ కోసం షెడ్యూల్ సిద్ధం చేసేసుకున్నాం. మా చిత్రానికి ‘కెన్నెడీ’ అనే టైటిల్ పెట్టుకోవడానికి ఆయన పూర్తిగా అంగీకారం తెలిపారు. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కెన్నెడీ’ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని మాత్రమే చెప్పాను. నా వ్యాఖ్యలను అతిగా చూడాల్సిన అవసరం లేదు. ఆయనతో కలిసి పనిచేయకుండా రిటైర్ అయితే కాను’’ అని స్పష్టత ఇచ్చారు.
రాహుల్ భట్, సన్నీలియోనీ జంటగా నటించిన చిత్రం ‘కెన్నెడీ’. అనురాగ్ కశ్యప్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ప్రదర్శన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జరిగింది. ఇందులో భాగంగా అనురాగ్ మాట్లాడుతూ.. విక్రమ్ను దృష్టిలో ఉంచుకునే తాను ఈ కథను సిద్ధం చేశానని, ఈ సినిమా విషయంలో ఆయన్ని సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, అందుకే రాహుల్తో ఈ సినిమా చేశానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్గా మారాయి. దీంతో విక్రమ్ తాజాగా దీనిపై స్పందించారు. విక్రమ్ ట్వీట్తో ఆయన అభిమానులు.. అనురాగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చెప్పేముందు కాస్త క్లియర్గా చెప్పాలని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది..
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్