Virat-Anushka: దుబాయ్‌లో పార్టీ చేసుకున్న విరుష్క, రాహుల్‌-అతియా శెట్టి

ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలను పలువురు సెలబ్రిటీలు దుబాయ్‌లో చేసుకున్నారు. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ-అనుష్క, కె.ఎల్‌ రాహుల్‌-అతియాశెట్టి, బాలీవుడ్‌ జోడీ సిద్దార్థ్‌ మల్హోత్ర-కియారా అడ్వాణీ కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేడుకల్లో పాల్గొన్నారు.

Updated : 02 Jan 2023 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు నూతన సంవత్సర వేడుకలను ఎంతో సంతోషంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల కోసం కొన్నిరోజుల ముందే వీళ్లిద్దరూ తమకెంతో ఇష్టమైన దుబాయ్‌కి వెళ్లారు. అక్కడి ప్రకృతి రమణీయత, సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలను ఆస్వాదిస్తూ పలు ఫొటోలను షేర్‌ చేశారు. షాపింగ్‌, డిన్నర్‌డేట్‌లతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

మరోవైపు, మరో ఇండియన్‌ క్రికెటర్‌ కె.ఎల్‌.రాహుల్‌ సైతం దుబాయ్‌ వేదికగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. తన ప్రియురాలు, నటి అతియా శెట్టితో కలిసి వేడుకల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ జోడీ ఫొటోలు నెట్టింటిలో వైరల్‌గా మారాయి. ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగనుందని బీటౌన్‌లో కొంతకాలంగా టాక్‌ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. బీటౌన్‌ సెలబ్రిటీ కపుల్‌ కియారా అడ్వాణీ, సిద్దార్థ్‌ మల్హోత్ర కూడా దుబాయ్‌లోనే న్యూ ఇయర్‌ పార్టీ చేసుకున్నారు. మనీశ్‌ మల్హోత్ర ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఈ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఓ కోటలో మూడు రోజులపాటు వీరి పెళ్లి వేడుకలు జరిగే అవకాశం ఉందని పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని