Virata Parvam: అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన రానా- సాయి పల్లవి

నటులు రానా, సాయి పల్లవి తమ అభిమానులకు శుభవార్త వినిపించారు. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘విరాట పర్వం’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

Published : 06 May 2022 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటులు రానా, సాయి పల్లవి తమ అభిమానులకు శుభవార్త వినిపించారు. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ ‘విరాట పర్వం’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జులై 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం.. మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం.. ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం’ అంటూ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. పోరాట నేపథ్యానికి సంబంధించిన ఈ లుక్‌లో రానా ఓ చేత్తో తుపాకీని, మరో చేత్తో సాయి పల్లవిని పట్టుకుని కనిపించాడు. తెలంగాణలో 90లనాటి నక్సలైట్‌ ఉద్యమాల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి, నవీన్‌ చంద్ర, నందితా దాస్‌, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. పోస్టర్లు, ప్రచార చిత్రాలతో ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఈ ప్రాజెక్టు గతేడాదే విడుదల కావాల్సి ఉండగా కొవిడ్‌ దృష్ట్యా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని