‘ఎనిమీ’.. ఓ పని పూర్తయింది

విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎనిమీ’. ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్ర బృందం.

Published : 13 Jul 2021 10:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాల్‌, ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎనిమీ’. ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్ర బృందం. సెట్‌లో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకుంటూ ‘ఎనిమీ షూటింగ్ పూర్తయింది. టీజర్‌ త్వరలోనే వస్తుంది’ అని తెలిపాడు నటుడు విశాల్‌. ‘వాడు-వీడు’ తర్వాత ఆర్య-విశాల్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాని మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. మృణాళిని రవి, మమతా మోహన్‌ దాస్‌ నాయికలు. ప్రకాశ్‌ కీలక పాత్ర పోషించారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతోపాటు శరవణన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విశాల్‌. ‘విశాల్‌ 31’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోంది. ఆర్య నటించిన ‘సార్‌పట్ట’ చిత్రం జులై 22 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని