Vishal: ఓటీటీలోకి విశాల్‌ ‘సామాన్యుడు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

విశాల్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘సామాన్యుడు’. థియేటర్లలో ఫిబ్రవరి 4న విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది.

Published : 28 Feb 2022 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాల్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘సామాన్యుడు’. థియేటర్లలో ఫిబ్రవరి 4న విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది. ‘జీ 5’లో మార్చి 4 నుంచి అలరించేందుకు సిద్ధమైంది. శరవణన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్‌ సరసన డింపుల్‌ హయాతి నటించింది. విశాల్‌ నిర్మించిన ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చారు.

సామాన్యుడి కథ ఇదీ..

పోరస్ (విశాల్) పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనే ఓ సామాన్య యువకుడు. మైథిలి (డింపుల్ హయాతి)తో ప్రేమలో ఉంటాడు. తన కుటుంబం, కలలే ప్రపంచంగా బతుకుతున్న పోరస్ చెల్లెలు ద్వారక ఓ పోకిరి వల్ల ఇబ్బంది పడుతుంది. పోకిరి నుంచి ద్వారకను కాపాడుకునే క్రమంలోనే ఆమె హత్యకు గురవుతుంది. ద్వారకతోపాటు మరి కొన్ని హత్యలూ జరుగుతాయి. ఈ హత్యల వెనక రాజకీయం ఉంటుంది. ఆ వలయాన్ని ఛేదించి హత్యల వెనకున్న హంతకులను పోరస్ ఎలా బయటకు తీశాడన్నది ఆసక్తికరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని