Saamanyudu: విశాల్‌ ‘సామాన్యుడు’ విడుదల తేదీ ఖరారు

విశాల్‌ కథానాయకుడిగా శరవణన్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సామాన్యుడు’.

Published : 29 Jan 2022 22:03 IST

హైదరాబాద్‌: విశాల్‌ కథానాయకుడిగా శరవణన్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సామాన్యుడు’. డింపుల్‌ హయాతీ కథానాయిక గణతంత్రదినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాదు, ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకుంది. ‘నేనొక సామాన్యుడిని ఎదురు తిరగకపోతే నన్నూ చంపేస్తారు’ అంటూ విశాల్‌ పలికిన సంభాషణలతో కూడిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. మరి ఈ సామాన్యుడు ఎవరిపై పోరాటం చేయాల్సి వచ్చింది? అందుకు కారణాలేంటి? విశాల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయ్యాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని