Vishal: ‘సామాన్యుడు’ వస్తున్నాడు

విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘సామాన్యుడు’ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసింది. తు.ప.శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. విశాల్‌ ఫిల్మ్‌

Updated : 30 Jan 2022 07:52 IST

విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘సామాన్యుడు’ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసింది. తు.ప.శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ స్వయంగా  నిర్మిస్తున్నారు. ఆయనకి జోడీగా డింపుల్‌ హయాతి నటించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. విశాల్‌ మరోసారి ఓసరికొత్త కథని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని, ఇటీవల విడుదల చేసిన పాటలకి, ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు  తెలిపాయి. ఛాయాగ్రహణం: కెవిన్‌రాజ్‌, సంగీతం: యువన్‌శంకర్‌ రాజా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని