Vishwaksen: అవన్నీ పుకార్లు మాత్రమే

తాను కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమా గురించి వస్తోన్న వరుస కథనాలపై నటుడు విశ్వక్‌సేన్‌ స్పందించారు. ఆ వార్తలు కేవలం పుకార్లేనని స్పష్టతనిచ్చారు.....

Published : 18 May 2021 17:34 IST

వరుస కథనాలపై నటుడు క్లారిటీ

హైదరాబాద్‌: తాను కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమా గురించి వస్తోన్న వరుస కథనాలపై నటుడు విశ్వక్‌సేన్‌ స్పందించారు. ఆ వార్తలు కేవలం పుకార్లేనని స్పష్టతనిచ్చారు. గతేడాది ‘హిట్‌’తో ప్రేక్షకులను అలరించిన విశ్వక్‌ ప్రస్తుతం ‘పాగల్‌’ కోసం వర్క్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆఖరి దశలో ఉన్న ఈ సినిమా షూట్‌ కొంతకాలం నుంచి వాయిదా పడింది. మరోవైపు లాక్‌డౌన్‌ వల్ల మూతబడిన థియేటర్లు ఎప్పుడు పునఃప్రారంభమవుతాయో పూర్తిగా స్పష్టత లేదు. ఈ క్రమంలోనే ‘పాగల్‌’ చిత్రాన్ని త్వరలో ‘ఓటీటీ’లో విడుదల చేయనున్నారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కాగా, తాజాగా సదరు వార్తలపై నటుడు విశ్వక్‌ స్పందించారు. ‘ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. మనం మరలా తిరిగి థియేటర్లలోనే కలుద్దాం బ్రదర్‌. మా సినిమాలో రీసౌండ్‌లు ఎక్కువ. ఎమోషన్స్‌ అంతకంటే ఎక్కువ. వాటిని సరిగ్గా ఆస్వాదించడానికి మీ టీవీలు, ఫోన్‌లు సరిపోవు. కాబట్టి ప్రస్తుతానికి జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. అలాగే మీ ప్రియమైన వారిని సంరక్షించుకోండి’ అని ఆయన పేర్కొన్నారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ‘పాగల్‌’ చిత్రానికి నరేష్‌ కొప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా థామస్‌, సిమ్రన్‌ చౌదరి కథానాయికలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని