Sukumar: సరికొత్త కలయిక

‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నారు దర్శకుడు సుకుమార్‌. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినీప్రియుల్ని మెప్పించారు

Updated : 05 Nov 2022 08:35 IST

‘పుష్ప’ (Pushpa) చిత్రంతో జాతీయ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నారు దర్శకుడు సుకుమార్‌ (Sukumar). ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినీప్రియుల్ని మెప్పించారు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri), నిర్మాత అభిషేక్‌ నామా (Abhishek). ఇప్పుడీ ముగ్గురు కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని దర్శకుడు వివేక్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘‘సినిమాతో అంతా ఒక్కటి కాబోతున్నాం. వివరాలు త్వరలో తెలియజేస్తాం. మీరు ఏమైనా గెస్‌ చేస్తారా’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు వివేక్‌. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది. దీనికి ఈ ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరిస్తారా? లేదా వివేక్‌, సుకుమార్‌లలో ఎవరైనా దర్శకత్వం వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి సుకుమార్‌ ‘పుష్ప2’తో బిజీగా ఉన్నారు. వివేక్‌ అగ్నిహోత్రి ‘ది దిల్లీ ఫైల్స్‌’ సినిమా చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని