AR Murugadoss: మహేశ్బాబు ‘స్పైడర్’ విషయంలో నేను చేసిన తప్పు అదే!
AR Murugadoss: మహేశ్బాబు స్పైడర్, రజనీకాంత్ దర్బారు చిత్రాలు ఆశించిన విజయం అందుకోలేకపోవడానికి గల కారణాన్ని దర్శకుడు మురుగదాస్ పంచుకున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఒకప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss). భారతీయ సినిమా రూ.100కోట్లు కలెక్ట్ చేస్తుందా? అనుకునే రోజుల్లో ‘గజనీ’తో ఆయన అదిరిపోయే సమాధానం ఇచ్చారు. అంతటి స్టార్ డైరెక్టర్ ఇటీవల వరుసగా పరాజయాలను చవి చూశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మహేశ్బాబు ‘స్పైడర్’, రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రాలు మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘1947 ఆగస్టు 16’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘స్పైడర్’, ‘దర్బారు’ చిత్రాలు ఆశించిన విజయం అందుకోలేకపోవడానికి గల కారణాన్ని ఆయనే స్వయంగా పంచుకున్నారు.
‘‘పాన్ ఇండియా అనే కాన్సెప్ట్లేని ఆ రోజుల్లో నేను వేసుకున్న లెక్కలు తప్పాయి. అవేంటంటే, తమిళ, తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేయడం. ఎస్జే సూర్య కోసం తమిళ ప్రేక్షకులు సినిమా చూస్తారని అనుకున్నా. అలాగే తెలుగులో మహేశ్ స్టార్డమ్ ఉపయోగపడుతుందని భావించా. దీంతో మహేశ్బాబును తమిళంలో స్టార్ కమర్షియల్ హీరోగా చూపించే ప్రయత్నం చేయలేదు. ప్రతినాయకుడితో పోలిస్తే, ఆ పాత్ర కాస్త డౌన్ ఉంటుంది. దీంతో తెలుగులో మిస్ ఫైర్ అయింది. కావాలనే తమ హీరో పాత్రను తమిళ డైరెక్టర్ తక్కువ చేసి చూపించాడని తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మహేశ్ అభిమానులు భావించారు. ఎస్జే సూర్య నా స్నేహితుడు కావడం వల్లే ఆయన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాననే చర్చ జరిగింది. ప్రతి సినిమాకు నేను ఏ స్థాయిలో శ్రమిస్తానో దీనికీ అదే స్థాయిలో కష్టపడ్డా. కానీ, సినిమా యావరేజ్గా ఆడిందంతే’’ అని మురుగదాస్ తెలిపారు.
ఇక రజనీకాంత్ ‘దర్బార్’ విషయంలోనూ తన అంచనాలు తప్పాయని చెప్పారు. ఫిల్మ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్ చాలా సులభమని, తక్కువ సమయంలో ముగించవచ్చని భావించా. పైగా రజనీ సర్ నాకు మార్చిలో డేట్స్ ఇచ్చారు. జూన్కల్లా ముంబయిలో ఆయన పోర్షన్ పూర్తి చేయాలి. లేకపోతే వర్షాలు మొదలై మరింత ఆలస్యమైపోతుంది. పైగా ఆయన ఆగస్టులో రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని, నటుడిగా ఇదే ఆయన చివరి సినిమా అవుతుందని అందరూ భావించారు. దీంతో సినిమాను చుట్టేయాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టు విషయంలోనైనా సరైన ప్లానింగ్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. సినిమా విషయంలో తగినంత సమయం తీసుకోవాలని ముఖ్యంగా సెట్స్, లొకేషన్స్, మేకప్, ఫిల్మ్ మేకింగ్ ఇలా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటేనే సినిమా బాగా వస్తుందని ఆమిర్ఖాన్ తనతో చెప్పారని మురుగదాస్ అన్నారు. ‘మీకో రహస్యం చెబుతాను. షూటింగ్ కూడా మొదలు పెట్టకుండా రిలీజ్ డేట్ ప్రకటిస్తే 50శాతం సినిమా ఫ్లాప్ అయినట్లే. ముందు సినిమా మొదలు పెట్టండి. అది ఎలా వస్తుందో చూడండి. 80శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఒకసారి రషెస్ చూసుకోండి. అప్పుడు విడుదల తేదీని ప్రకటించండి. దర్బార్ తర్వాత నేను గ్రహించిన విషయం ఇదే’ అని మురుగదాస్ కుండ బద్దలు కొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!