అందుకే ‘వైల్డ్డాగ్’ అని పెట్టాం: నాగార్జున
నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్డాగ్’. నాగార్జున ఇందులో ఎన్ఐఏ ఏజెంట్గా
హైదరాబాద్: నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్డాగ్’. నాగార్జున ఇందులో ఎన్ఐఏ ఏజెంట్గా కనిపించనున్నారు. సయామీ ఖేర్, దియా మీర్జా, అతుల్ కుల్కర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ..‘‘చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరాన్ని నా మనసులోంచి తీసేశా. ఇప్పుడే మిమ్మల్ని కొత్తగా చూస్తున్నట్లుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే హైదరాబాద్లో జరిగిన బ్లాస్ట్ గురించి అందరికి తెలిసిందే. ఈ అంశంపైనే సినిమా తీశాం. ఆ బ్లాస్ట్లో బాంబులు పెట్టిన వ్యక్తులను పట్టుకోవడమే లక్ష్యంగా కథ సాగుతుంది. ‘సార్ ఈ మిషన్కి వెళ్లామంటే తిరిగి వస్తామో? రామో.. నాకు ఏం జరిగినా పర్వాలేదు సర్. నేను పోయినా మా అమ్మకు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు’ డైలాగ్ నన్నెంతగానో ఆకట్టుకుంది. ఈ మిషన్కి నేను కమాండర్గా ఉంటాను. సయామీ ఖేర్ ఇందులో ‘రా ఏజెంట్’గా పనిచేస్తుంది. మిగతా వాళ్లు అంతా ‘ఎన్.ఐ.ఏ’లో ఉంటారు’’
‘‘నేను ఈ పాత్ర కోసం ఎవరిని కలవలేదు. దర్శకుడు ఏం చెబితే అదే చేశా. తొలుత చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నాం. కరోనా వల్ల జనాలు థియేటర్లకు వస్తారా? అని అనుకున్నాం. అయితే అంతలోనే సంక్రాంతికి ‘క్రాక్’ సినిమా వచ్చి విజయం అందుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ‘ఉప్పెన’ వచ్చింది. దాంతో మాకు ధైర్యం వచ్చి , సినిమాని ఏప్రిల్ 2న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అడవిలో వైల్డ్ డాగ్స్ సింహాలను కూడా వేటాడతాయి. దాన్ని చంపేంత వరకు అవి విశ్రమించవు. అనుకున్నది సాధించే వరకూ వెనుదిరగవు. అందుకే ఈ సినిమాకు ‘వైల్డ్ డాగ్’ అని పేరు పెట్టారు. ఇక ‘బంగార్రాజు’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతితీసుకురావాలని అనుకుంటున్నాం. జూన్ లేదా జులై చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నాం’’అని నాగార్జున తెలిపారు.
ఇక నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..‘‘ఇది అందరికి కనెక్ట్ అయ్యే కథ. చిత్రాన్ని తొలుత ఓటీటీకి అమ్మేశాం. అయితే తిరిగి మళ్లీ థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అలా ఓటీటీ నుంచి తిరిగి బయటకు వచ్చిన తొలి సినిమా ఇదే. ఓటీటీకి అమ్మినా, థియేటర్లో విడుదల చేసుకునే అవకాశం మాకు ఇచ్చారు. సినిమా థియేటర్లో విడుదలైన 30, 40 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుంది. ఓటీటీలో అయితే నాగార్జునను యావత్ దేశం మొత్తం చూడొచ్చని’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి సయామీ ఖేర్తో పాటు ఇతర నటీనటులు సాంకేతికవర్గం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. -
సూర్య సినిమా ఆగిపోలేదు.. వెట్రిమారన్ ఏమన్నారంటే..
నటుడు సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. -
అప్డేట్స్ ఇచ్చిన అగ్ర హీరోలు.. రిలీజ్ డేట్తో విజయ్.. టైటిల్స్తో సల్మాన్, గోపీచంద్
అగ్ర హీరోలు పలువురు తమ కొత్త సినిమాల అప్డేట్స్ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిలిపివేత.. పీవీఆర్ మల్టీప్లెక్స్పై ‘మైత్రీ మూవీస్’ ఆగ్రహం
పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే? -
‘గౌడ్ సాబ్’ కథ విని ఆశ్చర్యపోయా: సుకుమార్
కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్నారు. -
పండగ వేళ కొత్త పోస్టర్ల కళకళ.. మరో మూవీ ప్రకటించిన మాస్ హీరో
ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
‘దేవర’ ఆలస్యమైనా ప్రతి అభిమాని కాలరెగరేసుకునేలా ఉంటుంది: ఎన్టీఆర్
‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ (NTR) అన్నారు. -
‘డియర్’.. ‘గుడ్నైట్’ ఫిమేల్ వెర్షన్ కాదు: ఐశ్వర్యరాజేశ్
ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. -
ప్రభాస్తో హను రాఘవపూడి సినిమా లాక్.. ఏ జానరంటే!
తన తర్వాత సినిమా ప్రభాస్తో తీయనున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) స్పష్టం చేశారు. -
ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేద్దామంటే వద్దని చెప్పా: సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘స్పిరిట్’ (Spirit). -
పుష్పగాడి రూల్ మొదలైంది.. ‘పుష్ప 2’ టీజర్ వచ్చేసింది..!
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకుడు. -
ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదాల జోరు కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి. -
ఇది కదా.. ‘పుష్ప’ రేంజ్.. రూల్ చేయడానికి వచ్చేస్తున్నాడు!
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేసే టైమ్ను తెలియజేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్ను పంచుకుంది. -
‘భారతీయుడు 2’ వచ్చేది అప్పుడే.. అధికారికంగా ప్రకటించిన టీమ్
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు2’ విడుదలపై చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
బాక్సాఫీస్ వద్ద రూ.కోట్లు కొల్లగొడుతోన్న ‘ఆడు జీవితం’.. వసూళ్లు ఎంతంటే..?
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె