నాని, సుధీర్బాబు ఓటీటీకి వస్తున్నారా?
అన్నీ సిద్ధం.. ఇక విడుదలే ఆలస్యం అనుకుని.. లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన సినిమాల్లో ‘వి’ ఒకటి. నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఉగాదికి విడుదల చేయాలని చిత్రబృందం
హైదరాబాద్: అన్నీ సిద్ధం.. ఇక విడుదలే ఆలస్యం అనుకుని.. లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన సినిమాల్లో ‘వి’ ఒకటి. నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఉగాదికి విడుదల చేయాలని చిత్రబృందం తొలుత భావించింది. అయితే కరోనా వైరస్ - లాక్డౌన్ అమలు కారణంగా వాయిదా పడింది. ఈలోగా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారంటూ వార్తలు రావడం, వాటిని చిత్రబృందం అధికారికంగా, అనధికారికంగా ఖండించడమూ జరిగింది. అయితే ఇప్పుడు అనుకున్నదే అవుతోందట.
గత కొద్ది కాలంగా పెద్ద తెర మీద ‘వి’ అంటూ పట్టుపట్టి కూర్చున్న చిత్రబృందం ఇప్పుడు ఓటీటీవైపు చూస్తోందట. ఓటీటీ వేదికగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే దీనికి సంబంధించి కార్యక్రమాలు చివరిదశకు వచ్చాయని ఓటీటీ వర్గాల టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల ఐదున ‘వి’ని అమెజాన్ ప్రైమ్లో చూసేయొచ్చని చెబుతున్నారు. దీని కోసం అమెజాన్ ప్రైమ్ పెద్ద మొత్తంలో ఆఫర్ చేసిందనీ అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈవిషయంలో చర్చలు పూర్తికాలేదని దిల్ రాజు పీఆర్ టీమ్ తెలిపింది.
‘వి’ దారిలో టాలీవుడ్లో మరికొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి అంటున్నారు. వాటిలో చాలా వరకు ఇటీవల కాలంలో ‘ఓటీటీకి వెళ్లిపోతాయి’ అంటూ వార్తలు వచ్చిన సినిమాలే ఉన్నాయని సమాచారం. థియేటర్లు తెరుచుకునే అంశంలో స్పష్టత రాకపోవడంతో కొందరు నిర్మాతలు ఓటీటీ విడుదల గురించి ఆలోచిస్తున్నారట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’