Vikram: ‘విక్రమ్ 2’ లో విలన్ సూర్య కాదా?.. ఇంకొకరు ఉన్నారా?
ఈ ఏడాది భారీ విజయం అందుకున్న చిత్రాల్లో ‘విక్రమ్’ అగ్రస్థానంలో నిలిచింది. బాక్సాఫీస్పై ‘విక్రమ్’ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. కమల్హాసన్ కథానాయకుడిగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది భారీ విజయం అందుకున్న చిత్రాల్లో ‘విక్రమ్’ (Vikram) ఒకటి. బాక్సాఫీస్పై ‘విక్రమ్’ దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రల్లో లోకేశ్ కనగరాజ్ రూపొందించిన చిత్రమిది. ‘విక్రమ్’ సినిమా చివర్లో మాదకద్రవ్యాల సామ్రాజ్యానికి అధిపతి ‘రోలెక్స్’ (Rolex)గా సూర్య (Suirya) ఎంట్రీకి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇది వేరే లెవెల్ ‘విలన్ ఎంట్రీ’ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే, క్లైమాక్స్లో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ‘విక్రమ్’ సీక్వెల్ ఉందంటూ హింట్ ఇచ్చారు. ‘ఖైదీ’లోని కార్తి పోషించిన ఢిల్లీ పాత్రను, ఆ కథను ‘విక్రమ్’కు కనెక్ట్ చేశారు. దీంతో విక్రమ్కి, ఢిల్లీకి ‘విక్రమ్ 2’లో కామన్ విలన్గా రోలెక్స్ ఉంటాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
అయితే, ఆ సినిమాలో రోలెక్స్ విలన్ కాదని, అతడికి ఒక ప్రీ - హిస్టరీ ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే అంటే రోలెక్స్ ప్రధాన పాత్రగా సూర్యతో లోకేశ్ ఓ సినిమా చేయనున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో పాత్రలే హీరోలుగా, కథే ప్రతినాయకుడిగా ఉంటుందని ఇప్పటికే లోకేశ్ చెప్పారు. అలా విక్రమ్, ఢిల్లీ, రోలెక్స్.. ఇవన్నీ దర్శకుడి సినిమా ప్రపంచానికి చెందిన పాత్రలని, అందరూ హీరోలేనని చెబుతున్నారు.
లోకేశ్ కనగరాజ్ తదుపరి చిత్రం #దళపతి67లో విజయ్ పాత్ర కూడా వీటి సరసన చేరుతుందన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఈ సినిమా కూడా ఎల్సీయూ కిందకే వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ సినిమా గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలోనే ఉంటుందని చెప్పిన లోకేశ్, అది LCU కిందకి వస్తుందా? అంటే మాట దాటేశారు. అయితే, LCU కిందకు వచ్చే సినిమాలకు ఆ పేరు కచ్చితంగా వేస్తాం అని చెప్పారు లోకేశ్. ఈ ‘విక్రమ్ 2’లో సూర్యను విలన్గా చూపించడం కష్టమే అని చెప్పొచ్చు. మరి విలన్ ఎవరు అవుతారు అనేది ఆసక్తికరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు