Sai Madhav Burra: స్ఫూర్తినిచ్చే ‘వీరసింహారెడ్డి’.. ఫుల్ ప్యాకేజ్ ఇది: సాయిమాధవ్
రచయిత సాయిమాధవ్ బుర్రా ఇంటర్వ్యూ. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ సినిమా గురించి ఆయన పంచుకున్న విశేషాలు చదివేయండి..
హైదరాబాద్: ‘అది కల.. నిద్రలో కనేది. ఇది కళ.. నిద్ర లేపేది’, ‘బరువు, బాధ్యతలు చూసేవాడికి తెలియదు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది’, ‘చంపడమో చావడమో ముఖ్యం కాదు గెలవడం ముఖ్యం’.. ఇలా ఎన్నో సంభాషణలతో రచయితగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సాయిమాధవ్ బుర్రా. బయోపిక్, హిస్టారికల్, యాక్షన్ ఎంటర్టైనర్, రొమాంటిక్.. ఇలా నేపథ్యం ఏదైనా అలతి పదాలతో డైలాగ్స్ రాసి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచుతుంటారాయన. సాయిమాధవ్ మాటలు రాసిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సినిమా ఈ సినిమా 2023 జనవరి 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.
* దర్శకుడు మీకు ఈ చిత్ర కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించిన పాయింట్?
సాయిమాధవ్: ‘వీరసింహారెడ్డి’ కథ వినగానే నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ స్టోరీలోని ఎమోషన్ అందరినీ కట్టిపడేస్తుంది. ఓ పాయింట్ కాదు కథే కొత్తది. ప్రేక్షకులు ఇంతకుముందు చూడని అంశాలు ఇందులో ఉంటాయి. మాస్, క్లాస్, ఫ్యామిలీ.. అన్ని వర్గాల వారిని మెప్పించే కంటెంట్ ఇది. ‘వీరసింహారెడ్డి’ ఫుల్ ప్యాకేజ్. ఇందులో పక్కా మాస్ డైలాగ్స్ ఉంటాయి. ఈ చిత్రానికి సంభాషణలు రాసేందుకు 2 నెలలు పట్టింది.
* సంభాషణలు రాసేటపుడు ఒత్తిడికి గురయ్యారా?
సాయిమాధవ్: అలాంటిదేం లేదండీ. గతంలో.. బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్: మహానాయకుడు’ చిత్రాలకు పనిచేశా. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’. నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడికి లోనైతే ఔట్పుట్ అనుకున్నంత పర్ఫెక్ట్గా రాదనేది నా నమ్మకం. కథా చర్చల దశ నుంచి నేను ఈ సినిమాతో ప్రయాణించా. కథ, పాత్ర, సన్నివేశాన్ని మాత్రమేకాకుండా హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని రాశా.
* ‘వీరసింహారెడ్డి’ మీకు సవాలు విసిరిందా?
సాయిమాధవ్: ఈ కథే కాదు నాకు ప్రతి కథా సవాలే. స్టోరీలోని సోల్ని హైలైట్ చేసేందుకు ప్రతి రచయిత కష్టపడతాడు. ‘వీరసింహారెడ్డి’.. థీమ్ వింటే ఎవరైనా స్ఫూర్తిపొందుతారు. పక్కా కమర్షియల్ హంగులతో ఇలాంటి కథ తెరకెక్కడం అరుదు.
* దర్శకుడు గోపిచంద్ మలినేనితో పని చేయడం ఎలా అనిపించింది?
సాయిమాధవ్: గోపీచంద్తో నాకిది రెండో చిత్రం. మేం స్నేహితులం. ఆయన ఇప్పుడు అగ్ర దర్శకుడిగా ఉండడం సంతోషం. భవిష్యత్తులో ప్రపంచమంతా మాట్లాడుకునే స్థాయిలో ఉంటారాయన. తనకు కన్విన్స్ అవడం, కన్విన్స్ చేయడం రెండూ తెలుసు. గొప్ప దర్శకుడికి ఉండాల్సిన లక్షణాలివి.
* బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, చిరంజీవి ‘ఖైదీ నంబరు 150’ చిత్రాలు 2017 సంక్రాంతి బరిలో నిలిచాయి. 2023 సంక్రాంతికి మరోసారి వారిద్దరి సినిమాలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు?
సాయిమాధవ్: బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర..’, చిరంజీవి ‘ఖైదీ నంబరు 150’ చిత్రాలకు సంభాషణలు నేనే రాశా. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదలవడం మరిచిపోలేని జ్ఞాపకం. మరోసారి వారిద్దరి చిత్రాలు పండక్కి వస్తుండం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’కు నేను పనిచేయకపోయినా అదీ నాదే అని భావిస్తా. ఆ సినిమా దర్శకుడు బాబీ నా స్నేహితుడు.
దాని గురించి భవిష్యత్తులో ఆలోచిస్తా..
దర్శకత్వం చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. రచయితకావాలని ఇండస్ట్రీలోకి వచ్చా. అనుకున్నట్టుగానే రచయితనయ్యా. రచనపైనే నా దృష్టంతా. భవిష్యత్తులో ఓ కథని దర్శకుడిగా చెప్పాలనిపించినపుడు దాని గురించి ఆలోచిస్తా.
చేతిలో ఉన్న చిత్రాలు..
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్), పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, రామ్చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా, అర్జున్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం, నిర్మాత కె. ఎస్. రామారావు నిర్మిస్తున్న ఓ సినిమాకు పనిచేస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.