భాషపై ప్రేమ... మన బాధ్యత
పేరు మొదలుకొని మాట... పాట వరకు మన సినిమాల్లో పరభాష ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. వ్యాపార ధోరణి, సమాజ పోకడ అందుకు కారణం. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ మన రచయితలు భాషపై ప్రత్యేక దృష్టి పెడుతూ తెలుగు...
హైదరాబాద్: పేరు మొదలుకొని మాట... పాట వరకు మన సినిమాల్లో పరభాష ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. వ్యాపార ధోరణి, సమాజ పోకడ అందుకు కారణం. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనూ మన రచయితలు భాషపై ప్రత్యేక దృష్టి పెడుతూ తెలుగు దనాన్ని బలంగా వినిపించేలా చేస్తుంటారు. అలా భాషపై మమకారం చాటే రచయితల్లో అబ్బూరి రవి ఒకరు. ఇటీవల ‘నాంది’తో మరోసారి ఆయన తనవైన మాటలతో అలరించారు. ఆదివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఈ సందర్భంగా ఆయనతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఈ రోజు. తెలుగు సినిమా మాట... పాట మన మాతృభాషపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందంటారు?
సినిమా తెలియని గడపంటూ ఉండదు మనకి. సమాజంపై సినిమా ప్రభావం బలంగా ఉంటుంది. ఓ సినిమా గుర్తుకొచ్చిందంటే అందులో పాటో మాటో మదిలో మెదిలేలా చేస్తుంది. మన అనే భావన కలిగేలా చేస్తుంది. అందుకే సాధ్యమైనంత సంస్కారవంతంగా, మాటల్ని మాతృభాషలో రాయడానికే ప్రయత్నిస్తుంటా. పిల్లలు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్న రోజులివి. వాళ్లకి మన మాతృభాష తెలుగుమీద ప్రేమ పుట్టేలా చేయడం మన బాధ్యత. అమ్మ, నాన్న లేని వాడు అనాథ అయితే - మాతృభాష రాని వాడూ అంతే. అలాగని ఇతర భాషలు నేర్చుకోవద్దని ఎవరూ చెప్పరు. మాతృభాష మన గుర్తింపు.
మాతృభాష పరిరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారు?
తెలుగు నేర్చుకోవాలి అన్నది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి. తెలుగు భాషా ప్రావీణ్యులకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. లేకపోతే తెలుగు నేర్చుకొని, చదువుకొని ఏం చేయాలి? ఇంగ్లిష్ మాట్లాడితేనే గౌరవం ఇస్తున్నప్పుడు’ అనే ప్రశ్న తలెత్తుతుంది. మన సాహిత్యం, మన కవులు, మన ప్రాశస్త్యం గురించి పిల్లలకి పాఠశాల స్థాయి నుంచే తెలిసేలా చేయడం చాలా అవసరం.
‘నాంది’తో మరోసారి మీ కలం బలాన్ని చూపారు. ఈ సినిమా మాటల కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
ఒక చక్కటి కథా వస్తువుతో నా దగ్గరకి వచ్చారు దర్శకుడు విజయ్, రచయిత వెంకట్. ఒక కొత్త అంశాన్ని స్పృశిస్తూ సాగే కథ ఇది. ఇప్పటి వరకు నేను ‘బొమ్మరిల్లు’లాంటి కుటుంబ కథా చిత్రాలకి రాశాను. ‘ఎవడు’, ‘డాన్’, ‘పంజా’ తదితర మాస్ సినిమాలు, ‘క్షణం’, ‘ఎవరు’ వంటి థ్రిల్లర్ చిత్రాలు, ‘గూఢచారి’లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్లతోపాటు హారర్ సినిమాకి కూడా రాసాను. కానీ ఒక కోర్ట్ డ్రామా సినిమాకి పనిచేసే అవకాశం మొదటిసారి ‘నాంది’ రూపంలో వచ్చింది. అల్లరి నరేష్ సినిమాకి రాయడమూ ఇదే తొలిసారి. ఇలాంటి సామాజికాంశాలతో కూడిన చిత్రాలకి పనిచేసేటప్పుడు - ఏ మాట రెచ్చగొట్టే మాట కాకూడదు అనుకుంటాను. అందరినీ ఆలోచింపజేయాలి, ఇంటికి వెళ్లాక నా మాట గుర్తుండాలి అనుకుంటాను. మన జీవితం అలాగే సమాజం తాలూకు ఆలోచనా విధానాన్ని మార్చే మాట రాయగలిగే అవకాశం రావడం అనేది అదృష్టమే అని నమ్ముతాను.
దర్శకత్వం తప్పకుండా చేస్తాను. నేను చేయబోయే సినిమా కోసం కథలూ రాసుకున్నా. ప్రస్తుతం మాటల రచయితగా చేస్తున్నవి పూర్తవ్వగానే, నా కథలకి స్క్రీన్ప్లే, మాటలు రాసుకుని బౌండెడ్ స్క్రిప్టుతో పని మొదలు పెడతా. ప్రస్తుతం వరుణ్తేజ్ ‘గని’, అడవి శేష్ ‘మేజర్’ సినిమాలకు రాస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM