మాల్దీవుల్లో విహరిస్తున్న రాకీభాయ్‌ ఫ్యామిలీ

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో మారుమోగుతున్న పేర్లలో యష్‌ ఒకటి. ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ సినిమా ఇండస్ట్రీని ‘కేజీఎఫ్‌’తో ఒక్కసారిగా ప్రపంచ సినిమాకు పరిచయం చేశాడు. డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌, హీరో యష్‌ కాంబినేషన్‌లో ‘కేజీఎఫ్‌2’ సైతం ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే..

Published : 21 Jan 2021 02:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో మార్మోగుతున్న పేర్లలో యష్‌ ఒకటి. ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ సినిమా ఇండస్ట్రీని ‘కేజీఎఫ్‌’తో ఒక్కసారిగా ప్రపంచ సినిమాకు పరిచయం చేశాడు. డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌, హీరో యష్‌ కాంబినేషన్‌లో ‘కేజీఎఫ్‌2’ సైతం ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే.. దొరికిన కాస్త ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు నిర్ణయించుకున్నాడీ కన్నడ రాకింగ్‌ స్టార్‌. అందుకే సినిమా పూర్తి కాగానే.. తర్వాతి సినిమా పట్టాలెక్కించకముందే కుటుంబంతో మాల్దీవులకు పయనమయ్యాడు. భార్య రాధికా పండిట్‌, ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు. ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇటీల ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సలార్‌’ ప్రారంభ వేడుకలో యష్‌ పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి..

ముద్దుపెట్టలేదని బ్రేకప్‌ చెప్పిందట..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని