కేజీఎఫ్-2 రిలీజ్‌.. మోదీకి ఫ్యాన్‌ ట్వీట్‌!

కన్నడ స్టార్‌హీరో యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీఎఫ్‌-2’. రెండేళ్ల క్రితం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘కేజీఎఫ్‌’కు స్వీకెల్‌గా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అభిమానులందరూ...

Updated : 22 Aug 2022 14:44 IST

వైరల్‌గా మారిన వైనం

బెంగళూరు: కన్నడ స్టార్‌హీరో యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీఎఫ్‌-2’. రెండేళ్ల క్రితం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘కేజీఎఫ్‌’కు స్వీకెల్‌గా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జులై 16న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది.

చిత్రబృందం ప్రకటనతో సోషల్‌మీడియా వేదికగా తమ సంతోషాన్ని బయటపెడుతున్నారు యశ్‌ అభిమానులు. ఈ క్రమంలోనే ఓ అభిమాని.. ‘కేజీఎఫ్‌-2’ రిలీజ్‌ డేట్‌ను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జులై 16న సెలవు ప్రకటించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్‌ చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్‌- 2’ ఈ ఏడాది జులై 16న విడుదలవుతున్న విషయం తెలిసిందే. సినీ ప్రియులందరూ ఆ సినిమా కోసం ఎప్పటినుంచే నిరీక్షిస్తున్నారు. ఆ సినిమా విడుదలయ్యే రోజున దయచేసి దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని మేము కోరుతున్నాం. మా ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. అది కేవలం సినిమా మాత్రమే కాదు మా ఎమోషన్‌’ అని పేర్కొంటూ ఓ నెటిజన్‌ ప్రధానికి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి

వరుణ్‌ కొత్త సినిమా ఆ దర్శకుడితోనేనా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని