Yash Puri: ఓ కొత్త భాషను సృష్టించాం!
‘‘పరాయి భాషను గౌరవిద్దాం.. మాతృభాషను ప్రేమిద్దాం’ అని బలమైన సందేశమిచ్చే సినిమా ‘చెప్పాలని ఉంది’.
‘‘పరాయి భాషను గౌరవిద్దాం.. మాతృభాషను ప్రేమిద్దాం’ అని బలమైన సందేశమిచ్చే సినిమా ‘చెప్పాలని ఉంది’ (Cheppalani undhi). ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు యష్ పూరి (Yash Puri). ఆయన్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన చిత్రమే ‘చెప్పాలని ఉంది’. అరుణ్ భారతి.ఎల్ దర్శకత్వం వహించారు. స్టెఫీ పటేల్ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు యష్ పూరి.
* ‘‘చిత్ర ఉపశీర్షికలో చెప్పినట్లు ఒక మాతృభాష కథ ఇది. ఈ చిత్రంలో నేను జర్నలిస్ట్గా కనిపిస్తాను. అకస్మాత్తుగా వేరే భాషలో మాట్లాడుతుంటా. అది ఎవరికీ అర్థం కాదు. దాని వల్ల సమస్యలు ఎదుర్కొంటా. నా దగ్గర వాళ్లు దూరమవుతారు. నాకు ఏదో చెప్పాలని ఉంటుంది కానీ, చెప్పలేకపోతుంటా. అందుకే దీనికి ‘చెప్పాలని ఉంది’ అనే పేరు పెట్టాం. మరి ఆ వేరే భాష నాకు ఎందుకు వచ్చింది? దాని వల్ల ఎదురైన సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి’’.
* ‘‘ఈ చిత్రానికి మొదటి హీరో కథే. వినోదం, డ్రామా, యాక్షన్, రొమాన్స్.. ఇలా అన్ని రకాల వాణిజ్య హంగులు ఇందులో చాలానే ఉన్నాయి. సినిమాలో ప్రతి పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రం కోసం కొరియన్ భాష శైలిలో ఓ కొత్త భాషని సృష్టించాం. అది ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా స్క్రిప్ట్లో పెట్టాం. ఈ భాష నేర్చుకోవడానికి నాకు 15రోజులు పట్టింది’’.
* ‘‘మాది హైదరాబాదే. మొదట్లో క్రికెటర్ కావాలనుకున్నా. హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీ జట్టు ప్రాబబుల్స్లో చోటు దక్కించుకున్నా. కొన్ని కారణాల వల్ల ఆటకు దూరమయ్యాక సినిమాలతో ప్రేమలో పడ్డాను. అన్నపూర్ణలో ‘అలాంటి సిత్రాలు’ చిత్రంలో అవకాశం దక్కించుకున్నా. ఇప్పుడిలా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా హీరోగా పరిచయమవుతున్నా. ప్రస్తుతం సిల్లీ మాంక్ సంస్థలో ఓ చిత్రం చేస్తున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప