Ardhashathabdam: రంగులద్దుకున్న సందెపొద్దులాగా..
ప్రేమ పాటల పూదోట తెలుగు చిత్రసీమ. ఏటా తెలుగు తెరపై వందల కొద్దీ ప్రేమ పాటలు పల్లవిస్తుంటాయి. అయితే చక్కటి సాహిత్య సుగంధాలు నింపుకొని..
ప్రేమ పాటల పూదోట తెలుగు చిత్రసీమ. ఏటా తెలుగు తెరపై వందల కొద్దీ ప్రేమ పాటలు పల్లవిస్తుంటాయి. అయితే చక్కటి సాహిత్య సుగంధాలు నింపుకొని.. మైమరపించే బాణీలతో సినీప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు పదుల సంఖ్యలోనే ఉంటాయి. ‘‘ఏ కన్నులు చూడనీ చిత్రమే..’’ అలాంటి ఓ అపురూప గీతమే. ‘అర్ధ శతాబ్దం’ చిత్రం కోసం గీత రచయిత రెహమాన్ రాసిన మధురమైన ప్రేమ పాటిది. ఆయన దీని కోసం చేసిన కసరత్తుని ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా పంచుకున్నారిలా..
ఈ చిత్ర నిర్మాత కిరణ్, దర్శకుడు రవీంద్ర పుల్లె నా గత చిత్రాల పాటలు విని.. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. దీంట్లో నేను మొత్తం ఐదు పాటలు రాశాను. అవన్నీ బలమైన సాహిత్యంతో.. కథలో భాగంగా ఉంటాయి. అయితే వీటిలో ప్రత్యేకమైనది .. ‘‘ ఏ కన్నులు చూడనీ’’ పాటే. ప్రతి సినిమాలో ప్రేమ గీతాలు వినిపిస్తూనే ఉంటాయి. వీటికి భిన్నంగా ప్రేమని మళ్లీ మనదైన శైలిలో సరికొత్తగా ఆవిష్కరించగలగడం కఠిన పరీక్షే.
ఈ సినిమాలో హీరో చిన్నతనం నుంచే ఓ అమ్మాయిని అమితంగా ఆరాధిస్తుంటాడు. కానీ, ఆ పిల్లకి ఎదురుపడి.. ప్రేమిస్తున్నాని చెప్పే ధైర్యం ఆ కుర్రాడికి లేదు. ఆమె పట్ల తన మనసులో దాగి ఉన్న ప్రేమ భావాల్నే ఓ పాట రూపంలో ఇలా ప్రేక్షకులకి చెబుతుంటాడు ఆ అబ్బాయి. దర్శకుడు దీన్ని చక్కటి మాంటేజ్ పాటగా చిత్రీకరించారు. లిరికల్ వీడియో చూస్తే ఆ ప్రేమకథ ఏంటన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఈ చిత్ర కథ.. హీరో పాత్ర గ్రామీణ నేపథ్యంలో ఉంటాయి. అందుకే ఒక ఊరి అబ్బాయి తన ప్రేమని, తనకి తెలిసిన భాషలో అందంగా ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందో.. ఈ పాటలో చూపించే ప్రయత్నం చేశా.
ప్రేమని కళ్లతో చూడలేం. కానీ, ప్రేమించిన కుర్రాడు ఆ భావనని తన ప్రాణంతో చూడగలుగుతాడు. అందుకే తొలి పల్లవిలో ‘‘ఏ కన్నులు చూడనీ చిత్రమే.. చూస్తున్నది నేడు నా ప్రాణమే’’ అని రాశా. హీరో తన చిన్నతనంలో ఓ అనుకోని సంఘటన వల్ల ఆ అమ్మాయిని చూస్తాడు. అదొక మ్యాజికల్ మూమెంట్. అప్పుడామెపై పుట్టిన ప్రేమ.. తనతో పాటే పెరుగుతూ మనసులో ఓ వనంలా అల్లుకుపోయింది. దీన్నే తొలి చరణంలో ‘‘ఒకటే క్షణమే చిగురించె ప్రేమనే స్వరం .. ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం’’ అని చెప్పా. తర్వాత లైన్లలో ‘‘అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే.. గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే.. అందమైన ఊహలెన్నో ఊసులాడెలే’’ అంటూ ఆ కుర్రాడి ప్రేమని మట్టి వాసనున్న పదాలతో మిళితం చేసి అందంగా ఆవిష్కరించా. రెండో చరణంలో ‘‘ఎంత దాచుకున్నా పొంగిపోతు ఉన్నా.. కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన’’ అని రాశా.
‘‘దారి కాస్తు ఉన్నా నిన్ను చూస్తు ఉన్నా.. నువ్వు చూడగానే దాగిపోతు ఉన్నా’’ అని ఓ లైన్ రాశా. చిత్ర కథతో ముడిపడి ఉన్న ఎంతో ప్రాధాన్యమున్న వాక్యమిది. ఆ అబ్బాయికి తన ప్రేయసిపై ఎంత ప్రేమ ఉన్నా.. ఎదురుపడి చెప్పే ధైర్యం లేదు. అందుకే ప్రతిరోజూ దారి కాచి ఆమెనే చూస్తూ ఉన్నా.. తిరిగి చూస్తే భయపడి దాగుండి పోతుంటాడు. మూడో చరణంలో ‘‘ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా.. నవ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా’’ అని ఉంటుంది. సాధారణంగా సూర్యాస్తమయ సమయంలో ఆకాశం రకరకాల వర్ణాల్లో కనిపిస్తుంటుంది. వాటిలో చాలా రంగుల్ని మనం వర్ణించలేం. అన్ని వర్ణాలు తన ప్రేయసి నవ్వులో ఆ కుర్రాడికి కనిపిస్తుంటాయి. అందుకే ‘నీ నవ్వులు పంచే వెలుగులు చాలు.. ప్రత్యేకంగా దివ్వెలెందుకు’ అని ఆమెపై ప్రేమని కురిపిస్తుంటాడు.
ఈ పాట రాస్తున్నప్పుడు సిద్ శ్రీరామ్తో పాడిస్తారని తెలియదు. దీంట్లోని సాహిత్యం చూశాక.. ఇది ఆయనతో పాడిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచించారు. నేనీ గీతాన్ని వారం రోజుల్లో పూర్తి చేశా. తర్వాత పాట ట్యూన్ చేసే సమయంలో.. చరణాల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశా అంతే. ఓ మంచి సాహిత్యానికి చక్కటి బాణీ, గ్రాత్రం తోడైతే ఎలా ఉంటుందో ఈ పాటతో మరోసారి నిరూపితమైంది. ఒక గీతం ఓ చిన్న సినిమాకి ఇంతటి ఆదరణ తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే దీంట్లో ఎక్కువ క్రెడిట్ సిద్ శ్రీరామ్ గాత్రానికే ఇవ్వాలి. ఆయన పాడటం వల్లే ఈ పాట మరింత ఎక్కువ మందికి చేరువైంది.
సంగీతం: నవ్ఫాల్ రాజా ఎఐఎస్
గానం: సిద్ శ్రీరామ్
సాహిత్యం: రెహమాన్
దర్శకుడు: రవీంద్ర పుల్లె
పల్లవి:
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే //ఏ కన్నులు//
చరణం 1:
ఒకటే క్షణమే చిగురించె ప్రేమనే స్వరం
ఎదలో మనమై ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడెలే
అంతులేని సంబరాన ఊయలూపెలే //ఏ కన్నులు//
చరణం 2:
ఎంత దాచుకున్నా పొంగిపోతు ఉన్నా
కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోన
దారి కాస్తు ఉన్నా నిన్ను చూస్తు ఉన్నా
నువ్వు చూడగానే దాగిపోతు ఉన్నా
నిను తలచీ ప్రతి నిమిషం పరవశమై
పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోనా //అందుకే ఈ నేల నవ్వి// //ఏ కన్నులు//
చరణం 3:
ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండు కళ్ల నిండా
నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిదీ తెలియదులే మనసుకిదీ మధురములే
నాలోనే మురిసి ఓ వేకువలా
వెలుగై ఉన్నా //అందుకే ఈ నేల
నవ్వి// //ఏ కన్నులు//
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?