మీ ప్రేమ మాకు చాలా విలువైనది: జాన్వీ

అందాల నాయిక శ్రీదేవి కన్నుమూసి, చూస్తుండగనే మూడేళ్లు గడిచాయి. ఆమె మూడవ మరణవార్సికోత్సవాన్ని బోనీ కపూర్‌ తన కూతుళ్లతో కలిసి చెన్నైలోని మైలాపూర్‌ నివాసంలో ఈరోజు శ్రీదేవి జ్ఞాపకార్థం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Updated : 24 Feb 2021 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  అందాల నాయిక శ్రీదేవి కన్నుమూసి, చూస్తుండగానే మూడేళ్లు గడిచాయి. ఆమె కన్నుమూసి మూడేళ్లయిన సందర్భంగా బోనీ కపూర్‌ తన కూతుళ్లతో కలిసి చెన్నైలోని మైలాపూర్‌ నివాసంలో ఈరోజు ఆమె జ్ఞాపకార్థం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి 2018 దుబాయ్‌లో బోనీకపూర్‌ మేనల్లుడు మోహిత్‌ మార్వా పెళ్లికి హాజరై,  ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగిపోయి మరణించిచిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల తర్వాత జాన్వీ కపూర్‌ తన తల్లి గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ...‘‘నా హృదయంలో ఆమెకు పవిత్ర స్థానం ఉంది. ఇకపై నేను జీవించడం కొత్తగా నేర్చుకోవలసి ఉంటుంది. ఈ శూన్యంలోనూ మీరు నన్ను ముందుకు నడిపిస్తారు. నేను కళ్లు మాసుకున్న ప్రతిసారీ మీరు చెప్పిన మంచి విషయాలు మాత్రమే నాకు గుర్తుకొస్తున్నాయి. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ కలిగి ఉంటాం. చాలా స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉన్నారు.  మీరు ఈ ప్రపంచం కోసం ఉన్నారు. అందుకే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్లారు’’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ రాజ్‌ కుమార్‌రావ్‌, వరుణ్‌ శర్మలతో కలిసి ‘రూహీ’ చిత్రంతో పాటు ‘గుడ్‌ లక్‌ జెర్రీ’, ‘దోస్తానా2’లోనూ నాయికగా నటిస్తోంది. 

ఇవీ చదవండి: 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని