Tollywood: టాలీవుడ్‌ ప్రముఖులతో భేటీకానున్న సీఎం జగన్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుముఖత

Updated : 14 Aug 2021 22:04 IST

అమరావతి: తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నటులు, దర్శక-నిర్మాతలతో సీఎం చర్చించనున్నారు. కరోనా కారణంగా చిత్ర పరిశ్రమకు వాటిల్లిన నష్టం, పునరుత్తేజం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకురానున్నారు. ముఖ్యంగా థియేటర్లు, టికెట్‌ ధరలు సహా పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. ఆగస్టు చివరి వారంలో ఈ సమావేశం జరుగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరి ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటారనే విషయంపై త్వరలోనే పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. గతంలోనూ సీఎం జగన్‌ తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ విషయంలో మంత్రి పేర్ని నాని కీలకంగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని