యుగానికి ఒక్కడు సీక్వెల్‌లో ఆ హీరో ఫిక్స్‌

సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘అయిరతిళ్‌ ఒరువన్‌’. 2010లో విడులైన ఈ సినిమా

Published : 03 Jan 2021 14:25 IST

హైదరాబాద్‌: సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘అయిరతిళ్‌ ఒరువన్‌’. 2010లో విడులైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. తెలుగులోనూ ‘యుగానికి ఒక్కడు’గా అనువాదం అయింది. దీనికి కొనసాగింపు చిత్రం రాబోతుందని కొంత  కాలంగా కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించనున్నాడు. దర్శకుడు సెల్వ రాఘవన్‌ ఈ విషయాన్ని అధికారికంగా ట్విటర్‌లో ప్రకటించారు.

దీనిపై ధనుష్‌ స్పందిస్తూ... ‘సినిమా ప్రీ ప్రొడక్షన్‌కి సంవత్సర కాలం పడుతుంది. సెల్వరాఘవన్‌  తెరకెక్కిస్తున్న మా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పూర్తయేందుకు మరింత సమయం పడుతుంది. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు మా వంతు కృషి చేస్తాం’ అని బదులిచ్చారు. సినిమాను 2024లో థియేటర్లకు తీసుకురానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని