ఏప్రిల్‌ 9 నుంచి ఓటీటీలో ‘యువరత్న’

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ నటించిన ‘యువరత్న’ ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 9 నుంచి ఆమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ఆమెజాన్‌ ప్రైమ్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది.

Published : 08 Apr 2021 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ నటించిన ‘యువరత్న’ ఓటీటీలో విడుదల కానుంది. ఏప్రిల్‌ 9 నుంచి ఆమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ఆమెజాన్‌ ప్రైమ్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. కళాశాల రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. పునీత్‌రాజ్‌కుమార్‌ తెలుగులో నేరుగా సినిమా విడుదల చేయడం ఇదే తొలిసారి. కాగా.. ఏప్రిల్‌ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అటు కన్నడ ప్రేక్షకులతోపాటు టాలీవుడ్‌లోనూ అలరిస్తోంది. ప్రకాశ్‌రాజ్‌, సాయేషా కీలకపాత్రల్లో కనిపించారు. సంతోష్‌ ఆనంద్‌రామ్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను హోంబలే సంస్థ నిర్మించింది. తమన్‌ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని