yvs chowdary: వాళ్లే బాధ్యత వహించాలి
‘‘గ్యాప్లు మనం తీసుకోం.. అవి వస్తుంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. ఫలితంగా ఏదోక సమయంలో కొన్ని విరామాలు తప్పవు. ఇప్పుడు నాకొచ్చిన విరామమూ అలా వచ్చిందే’’ అంటున్నారు...
‘‘గ్యాప్లు మనం తీసుకోం.. అవి వస్తుంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. ఫలితంగా ఏదోక సమయంలో కొన్ని విరామాలు తప్పవు. ఇప్పుడు నాకొచ్చిన విరామమూ అలా వచ్చిందే’’ అంటున్నారు వైవీఎస్ చౌదరి. ‘సీతారామరాజు’, ‘యువరాజు’, ‘సీతయ్య’, ‘దేవదాస్’ వంటి విజయవంతమైన చిత్రాలతో చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడాయన. ‘రేయ్’ సినిమా తర్వాత కాస్త విరామం తీసుకున్న ఆయన.. ఇప్పుడు తనదైన శైలిలో ఓ తెలుగుదనం నిండిన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన విలేకర్లతో ఆన్లైన్ వేదికగా ముచ్చటించారు వైవీఎస్ చౌదరి.
ఓ దర్శకుడిగా జయాపజయాలు, విరామాల విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
‘‘ఓ వ్యక్తి ప్రతిభకు జయాపజయాలు కొలమానాలు కావని నమ్మే వ్యక్తిని నేను. ఎప్పుడైనా పరాజయం ఎదురైనా.. అది ఆ ఒక్క ఉత్పాదకతకే పరిమితం. అంతేకాని మన కృషిలోనూ.. సృజనాత్మకతలోనూ ఫెయిలైనట్లు కాదు. ఏ దర్శకుడైనా సరే.. ఎప్పటికప్పుడు అప్డేట్ అవడం ముఖ్యం. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోంది.. సినిమా ఎలా రూపాంతరం చెందుతోంది.. ప్రేక్షకుల అభిరుచుల్లో ఎలాంటి మార్పులొస్తున్నాయి..? ఇలాంటివన్నీ గమనిస్తుండాలి. మొదటి నుంచీ నేను అనుసరిస్తున్న సిద్ధాంతమిది. కెరీర్ ఆరంభంలో పదేళ్లకు పైగా తెలుగు నేటివిటీకి దూరంగా ఉన్నా.. వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు తీయగలిగానంటే కారణం నేను నమ్మిన ఈ సిద్ధాంతమే. నేనిప్పటికీ ఇదే ఫాలో అవుతున్నా. ఈ మధ్య చిత్రసీమకి కాస్త దూరమైనా.. పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ వస్తున్న మార్పులను తెలుసుకుంటున్నా’’.
మరిప్పుడున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కథ సిద్ధం చేశారా?
‘‘ప్రస్తుతం నేనొక అందమైన ప్రేమకథ సిద్ధం చేశా. తెలుగు వారి సంస్కృతి - సంప్రదాయాలు ఉట్టిపడేలా.. తెలుగు వాళ్ల వాడి-వేడి ప్రతిబింబించేలా.. స్క్రిప్ట్ రాసుకున్నా. దీంట్లో మధురమైన సంగీతంతో పాటు తేనెలూరే సాహిత్యమూ మిళితమై ఉంటుంది. వీలైనంత తక్కువ సమయంలో ప్రేక్షకులకు ఆసక్తిరేకెత్తించేలా ఈ సినిమాని ముస్తాబు చేయాలని ప్రణాళిక రచిస్తున్నా. దాదాపు కొత్తవాళ్లతోనే ఈ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నా. కథానాయికగా ఓ పదహారణాల తెలుగమ్మాయిని తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నిజానికి గతేడాదే దీన్ని సెట్స్పైకి తీసుకెళ్లాలి అనుకున్నా. కరోనా - లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్ దెబ్బ కొట్టింది. ఈ పరిస్థితులు కుదుటపడగానే చిత్రీకరణ ప్రారంభిస్తా’’.
ప్రస్తుతం దర్శకులంతా వెండితెరతో పాటు డిజిటల్ వేదికల వైపు దృష్టి సారిస్తున్నారు. మరి మీరు?
‘‘2012లో రవితేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘నిప్పు’ చిత్రం నిర్మించా. ఆ సమయంలోనే కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ వెండితెరపైనా, బుల్లితెరపైనా, డిజిటల్ వేదికలపైనా వినోదం అందించాలని నిర్ణయించుకున్నా. కానీ, నా ‘రేయ్’ చిత్రం రకరకాల కారణాలతో ఆలస్యమవడం వల్ల ఆ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. అయితే ఇప్పుడా ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. నా బొమ్మరిల్లు బ్యానర్ ద్వారా అన్ని రకాల వినోద వేదికలపైనా కొత్త ప్రతిభను పరిచయం చేస్తూ.. కొత్త కంటెంట్ను చూపించాలనుకుంటున్నా. ఇందుకోసం ఓ టీమ్ని కూడా సిద్ధం చేశా’’.
ఈ కొవిడ్ పరిస్థితుల నుంచి చిత్రసీమ తిరిగి కోలుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చనుకుంటున్నారు?
‘‘కొవిడ్ ఉద్ధృతి ఎప్పుడు తగ్గుతుందన్న దానిపై శాస్త్రవేత్తల్లోనే సరైన స్పష్టత లేదు. గతంలో మాస్కులు, శానిటైజర్లు వాడితే మహమ్మారిని అడ్డుకోవచ్చన్నారు. తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాని నివారించొచ్చన్నారు. ఇప్పుడు ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా..
జాగ్రత్తగా ఉండక తప్పదంటున్నారు. దేనిపైనా పూర్తిస్థాయి స్పష్టత కనిపించడం లేదు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా.. మనం ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లాల్సిందే. నాకు తెలిసి.. వ్యాక్సినేషన్ సమర్థంగా పూర్తయ్యి, పరిస్థితులన్నీ కుదుట పడితే మరో మూడు నుంచి ఆరు నెలల్లో చిత్ర పరిశ్రమ కాస్త కుదుట పడొచ్చు అనుకుంటున్నా’’.
దేశంలో కరోనా ఈస్థాయిలో విజృంభించడానికి కారణాలేంటి అనుకుంటున్నారు?
‘‘ముందు చూపు లేకపోవడమే ఈ దుస్థితికి కారణం. ఈ విషయంలో ప్రత్యేకంగా ఏ ఒక్కరినో నిందించలేం. కరోనా రెండో దశ ఇంత ఉద్ధృతిలో లేకపోయుంటే.. ‘మనది కర్మ భూమి, అందుకే రాలేదు’ అని స్టేట్మెంట్లు వచ్చుండేవి. అలా జరగలేదు కాబట్టి.. ముందే ఎందుకు హెచ్చరించలేదని అడిగే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా మనం పరిపాలన ఒకరి చేతుల్లో పెట్టాం కాబట్టి.. ప్రస్తుత పర్యావసానాలన్నింటికీ వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్