ఆహాలో ‘జాంబీరెడ్డి’.. ట్రైలర్‌ చూశారా?

‘అ’ సినిమాతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఆయన దర్శరత్వంలో జాంబీ జోనర్‌లో తెరకెక్కిన చిత్రమే ‘జాంబీరెడ్డి’. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రంలో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా ఇందులో కథానాయకుడు.

Updated : 07 Dec 2022 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘అ’ సినిమాతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ వర్మ. ఆయన దర్శకత్వంలో జాంబీ జోనర్‌లో తెరకెక్కిన చిత్రమే ‘జాంబీరెడ్డి’. తేజ సజ్జా కథానాయకుడు. యాపిల్ ట్రీ స్టూడియోస్‌ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 5న చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆహా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సరికొత్త ట్రైలర్‌ను ఆహా అభిమానులతో పంచుకుంది. ఆనంది, ద‌క్ష నగర్కర్‌‌, హర్షవర్థన్‌‌, ర‌ఘుబాబు, హ‌రితేజ‌, పృథ్వీరాజ్‌, కారుమంచి రఘు తదితరులు నటించిన ఈ సినిమా మార్చి 26న ‘ఆహా’లో ప్రసారం కానుంది. ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఆ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని