మంచి సినిమా తీశాం.. ఆశీర్వదించండి

తేజ సజ్జ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘జాంబీరెడ్డి’. ‘అ!’, ‘కల్కీ’ సినిమాల డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆనంది, దక్ష నగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌ ప్రేక్షకులను బాగా

Updated : 03 Feb 2021 04:07 IST

హైదరాబాద్‌: తేజ సజ్జ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘జాంబీరెడ్డి’. ‘అ!’, ‘కల్కీ’ సినిమాల డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆనంది, దక్ష నగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా హీరో వరుణ్‌తేజ హాజరయ్యారు. డైరెక్టర్‌ ప్రశాంత్‌వర్మ, నిర్మాత రాజశేఖర్‌వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించామన్నారు. తెలుగులో వస్తున్న తొలి జాంబీ చిత్రమిదే. ఈ చిత్రానికి యూనిట్‌ సభ్యులంతా చాలా కష్టపడ్డట్లు వారు చెప్పారు. మునుపెన్నడూ లేని విధంగా తెలుగులో తాము కొత్త ప్రయోగంతో మంచి సినిమా తీశామని, అందరూ స్వాగతించి.. సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వరుణ్‌ తేజ్‌ తొలి టికెట్‌ను కొనుగోలు చేశారు.

ఇదీ చదవండి..

క్లాస్‌ కల్యాణి.. మాస్‌ బిర్యాని.. సాంగ్‌ చూశారా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని