కువైట్లో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
ఎన్నారై తెదేపా-కువైట్ శాఖ ఆధ్వర్యంలో తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందు ......
కువైట్: ఎన్నారై తెదేపా-కువైట్ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు, తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేకు కట్ చేసి నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెదేపా సెల్ సీనియర్ నేత వెంకట్ కోడూరి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో సంపద సృష్టి జరిగి మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షించారు. ఆయన్ను నవ్యాంధ్ర దార్శనికుడు, అమరావతి సృష్టికర్త అని కొనియాడారు.
ఎన్నారై తెదేపా సెల్ సీనియర్ నేత సురేష్ బాబు నాయుడు మాలెపాటి మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ.. ఆ ఇబ్బందులు తొలగి ప్రజలు సౌకర్యవంతమైన జీవనం కొనసాగించాలంటే రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి చంద్రబాబు నాయుడుని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే ఏపీ అంధకారమవుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రం దివాలా తీసి ప్రజలపై అనేక రకాల పన్ను భారాలు మోపుతున్నారని ఉదయ్ ప్రకాశ్ అన్నారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని పాలిస్తున్నారే తప్ప ఎక్కడా ఒక్క రూపాయి సంపద సృష్టి జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ పాలనకు చరమగీతం పాడాలంటే అంతా కలిసి పార్టీ కోసం శ్రమించి చంద్రబాబును తిరిగి సీఎం చేయలేకపోతే ఏపీ మరో శ్రీలంక అవుతుందని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై తెదేపా గల్ఫ్ నేత గుదె శంకర్ చౌదరి, ఎన్నారై తెదేపా మైనార్టీ విభాగం అధ్యక్షుడు రహ్మతుల్లా సూచన మేరకు కార్యవర్గం, ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య, ఎన్టీఆర్ పరిటాల ట్రస్టు అధ్యక్షుడు జి. నరసింహలులు, చంద్రన్న సేవా సమితి అధ్యక్షుడు షేక్ సుబహాన్ తెదేపా కువైట్ అధ్యక్షులు నాయనిపాటి విజయ్కుమార్ చౌదరి, సీనియర్ నాయకులు వెంకటేశ్ నాయుడు వేగి సహా భారీ సంఖ్యలో తెదేపా శ్రేణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నారై తెదేపా సెల్ కువైట్ కౌన్సిల్ సభ్యులు ఓలేటి రెడ్డయ్య చౌదరి, షేక్ మహ్మద్ అర్షద్ సమన్వయం చేయగా.. దీనికి పరోక్ష సహకారం అందించిన ఎన్నారై తెదేపా గల్ఫ్ అధ్యక్షుడు గుదె నాగార్జునకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు