చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి: కువైట్‌లో జన్మదిన వేడుకలు

తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. తెదేపా కువైట్‌ శాఖ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు

Published : 22 Apr 2022 09:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. తెదేపా కువైట్‌ శాఖ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు ఆధ్వర్యంలో సార్మియా ఏరియాలోని అవంతి ప్యాలెస్‌లో ఈ వేడుకలు జరిగాయి. బుధవారం వర్కింగ్‌ డే అయినప్పటికీ ఎంతోమంది అభిమానులు ఈ జన్మదినోత్సవానికి తరలిచ్చారు. ఈ వేడుకల్లో ఆన్‌లైన్‌ ద్వారా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, ఎన్‌ఆర్‌ఐ తెదేపా సమన్వయకర్త చప్పిడి రాజశేఖర్‌, బీవీఆర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నేతలు చేసిన ప్రసంగాలు తెదేపా కార్యకర్తలు, అభిమానులను ఉత్తేజపరిచాయి. కువైట్‌తో పాటు వివిధ గల్ఫ్‌ దేశాలలోని తెదేపా నేతలు కూడా పాల్గొన్నారు. ఖతార్‌ నుంచి సత్యనారాయణ, గొట్టిపాటి వెంకటరమణ.. సౌదీ అరేబియా నుంచి రాధాకృష్ణ, నాగశేఖర్‌, దుబాయ్‌ నుంచి సింగయ్య, హరి, కువైట్‌ నుంచి మద్దిన ఈశ్వర్‌ నాయుడు, షేక్‌ బాషా, సుబ్బారెడ్డి, చాన్‌ బాషా, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అభిమానులు కేక్‌ కట్‌ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని.. 2024లో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని