యూఏఈలో నిత్యావసరాల పంపిణీ

తెరాస ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేశ్‌ ఆధ్వర్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని తెలంగాణ..

Published : 26 Apr 2020 05:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ప్రవాస విభాగం సమన్వయకర్త బిగాల మహేశ్‌ ఆధ్వర్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని తెలంగాణ కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. దుబాయ్‌, షార్జా, అబూదాబి, పుజేరహ్‌, ఉమ్మాలుక్కువైన్‌లలో లాక్‌డౌన్‌తో కంపెనీలు మూతపడటంతో కార్మికులు ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న మహేశ్‌ సుమారు వేయి మంది కార్మికులకు నిత్యావసర వస్తువులను శనివారం అందజేశారు. కార్యక్రమంలో గల్ఫ్‌ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహ, ఉపాధ్యక్షుడు శేఖర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని