వీసా ఉన్నా రాలేని పరిస్థితి..!
ప్రతిబంధకాలుగా మారిన కేంద్ర ప్రభుత్వ నిబంధనలు
వాషింగ్టన్: కరోనా కట్టడి ఆంక్షల నేపథ్యంలో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకు ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం విధించిన కొన్ని నిషేధాజ్ఞలే అడ్డంకిగా మారాయి. అనేక మంది భారత్కు వచ్చే అవకాశం, అనుమతి ఉన్నా రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో తమని స్వదేశానికి తీసుకెళ్లేందుకు ‘వందే భారత్’ అంటూ వస్తున్న విమానాల్ని చూసి వారి ముఖంలో వెల్లివిరిసిన సంతోషం ఎంతో కాలం నిలవలేదు. వివరాల్లోకి వెళితే..
విదేశీయుల వీసాలతో పాటు వీసా అవసరం లేకుండా భారత్కు వచ్చే వెసులుబాటు ఉన్న ‘ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ)’ కార్డులపై కేంద్ర ప్రభుత్వం గత నెల నిషేధం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు అక్కడ చిక్కుకున్న కొంతమందికి ఈ ఆంక్షలే అడ్డంకిగా మారాయి. పలువురు హెచ్-1బీ, గ్రీన్ కార్డుదారుల పిల్లలు అక్కడే పుట్టడంతో వారంతా ఓసీఐ పరిధిలోకి వస్తారు. తల్లిదండ్రులు ప్రయాణించేందుకు ఇక్కడి నిబంధనలు ఒప్పుకుంటున్నా.. ఓసీఐ పరిధిలోకి వచ్చే పిల్లల్ని మాత్రం అనుమతించే అవకాశం లేదు. దీంతో సిబ్బంది వారిని విమానంలోకి అనుమతించలేదు. గత్యంతరం లేక తల్లిదండ్రులు సైతం వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
న్యూజెర్సీలో హెచ్-1బీ వీసాపై ఉంటున్న దంపతులు కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయారు. నిబంధనల ప్రకారం వారు 60 రోజుల్లోగా అమెరికా విడిచి వెళ్లాలి. దీంతో చేసేదిలేక ఉన్న ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎయిర్పోర్టుకు వచ్చేశారు. ఆ పిల్లలిద్దరూ అక్కడే పుట్టడంతో వారు ఓసీఐ పరిధిలోకి వస్తారు. దీంతో సిబ్బంది వారిని అనుమతించలేదు. పిల్లల్ని విడిచి వారు మాత్రమే రాలేని పరిస్థితి. చివరకు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘న్యూయార్క్లో ఉన్న భారత రాయబార కార్యాలయ సిబ్బంది, ఎయిరిండియా సిబ్బంది చాలా సహకరించారు. కానీ, ఇటీవలి భారత ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో వారంతా నిస్సహాయులుగా మారారు’’ అని పరిస్థితిని వివరించారు. ఇలా నిబంధనల్లోని సాంకేతిక సమస్య వల్ల అనేక మంది హెచ్-1బీ, గ్రీన్ కార్డుదారులు అక్కడే నిలిచిపోయారు.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
-
India News
Freebies: వాటిపై నిజమైన చర్చ జరగాలి.. కేజ్రీవాల్కు నిర్మలా సీతారామన్ కౌంటర్
-
Movies News
Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
-
General News
Andhra news: నాగార్జున సాగర్కు పోటెత్తిన వరద.. 26 గేట్ల ఎత్తివేత
-
Sports News
Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
-
Crime News
Crime News: చేపల వేటకు వెళ్లి ఒకరు.. కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు గల్లంతు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్కు తీవ్ర గాయాలు
- Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
- Smoking In Plane: విమానంలో దర్జాగా పడుకొని సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్..!
- IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?