వేలిముద్ర.. విదేశీయానానికి రాజముద్ర
పోలీసు కేసులు ఉన్నవారికి పాస్పోర్టులు ఇస్తే.. హాయిగా విదేశాలకు చెక్కేసి విచారణ నుంచి తప్పించుకోవచ్చు. అందుకే పాస్పోర్టు జారీకి పోలీసు విచారణ తప్పనిసరి. కాని చాలా సందర్భాల్లో ఇది సరిగా
పాస్పోర్టు జారీకి తప్పనిసరి కానున్న వేలిముద్రల పరిశీలన
రెండేళ్లుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న పోలీసులు
ఈ విధానంలో 116 మంది నేరచరితుల గుర్తింపు
ఈనాడు - హైదరాబాద్
పోలీసు కేసులు ఉన్నవారికి పాస్పోర్టులు ఇస్తే.. హాయిగా విదేశాలకు చెక్కేసి విచారణ నుంచి తప్పించుకోవచ్చు. అందుకే పాస్పోర్టు జారీకి పోలీసు విచారణ తప్పనిసరి. కాని చాలా సందర్భాల్లో ఇది సరిగా జరగదు. మాఫియా డాన్ అబూ సలేం ఉదంతమే ఇందుకు నిదర్శనం. కర్నూలు చిరునామాతో దరఖాస్తు చేసుకొని, కిందిస్థాయి సిబ్బందిని మచ్చిక చేసుకొని పాస్పోర్టు పొందిన అబూ సలేం అతని ప్రియురాలు మోనికా బేడి గ్రీస్ చెక్కేశారు. ఇకమీదట అలా కుదరదు. పాస్పోర్టు దరఖాస్తుదారుల వేలిముద్రల ద్వారా వారి నేర చరిత్రను పరిశీలించబోతున్నారు. రెండేళ్లుగా నమూనా పద్ధతిలో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో దీన్ని అమలు చేస్తుండగా ఇక మీదట ప్రతి దరఖాసుదారుడి వేలిముద్రలనూ విశ్లేషించనున్నారు. తద్వారా నేర చరిత్ర ఉన్న వారికి పాస్పోర్టులు జారీ కాకుండా సమర్థంగా నిరోధించాలని భావిస్తున్నారు. గత రెండేళ్ళ కాలంలో రాష్ట్రంలో ఇలా వేలిముద్రల ద్వారా 116 మందిని గుర్తించి పాస్పోర్టులు రాకుండా అడ్డుకోగలిగారు.
రెండు, మూడు రోజుల్లోనే విచారణ పూర్తి
నేర చరిత్ర ఉన్నవారికి పాస్పోర్టులు ఇవ్వరు. అందుకే దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీసు విచారణ జరిపేది అందుకే. దరఖాస్తుదారుడి చిరునామా ప్రకారం స్పెషల్ బ్రాంచి పోలీసులు వ్యక్తిగతంగా కలిసి, చుట్టుపక్కల వారిని విచారిస్తారు. దాంతోపాటు తమవద్ద అందుబాటులో ఉన్న రికార్డులు పరిశీలిస్తారు. ఈ మేరకు పాస్పోర్టు కార్యాలయానికి నివేదిక పంపుతారు. గతంలో ఈ మొత్తం ప్రక్రియకు కనీసం 20 రోజులు పట్టేది. కానీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రెండు మూడు రోజుల్లోనే దీన్ని పూర్తి చేస్తున్నారు. ఒకవేళ దరఖాస్తుదారునికి ఏదైనా నేర చరిత్ర ఉన్నా, పోలీసు కేసులు ఉన్నా పాస్పోర్టు జారీ నిరాకరిస్తారు. దీనిపై విభేదిస్తే సదరు దరఖాస్తుదారుడు న్యాయస్థానం ద్వారా ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే పాస్పోర్టు జారీ అంశంలో పోలీసు విచారణే కీలకమైంది. అందుకే విచారణకు వచ్చే సిబ్బందిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించి తద్వారా సానుకూల నివేదిక వచ్చేలా చూసుకుంటారు. ముఖ్యంగా నేర చరిత్ర ఉన్న వారు ఇలా ప్రయత్నిస్తుంటారు. దీన్ని నిరోధించే ఉద్దేశంతోనే పోలీసుశాఖ పాస్పోర్టు దరఖాస్తు దారుల వేలిముద్రలు పరిశీలించాలని భావిస్తోంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. దరఖాస్తుదారుల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని వారి వేలిముద్రలను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర ఫింగర్ప్రింట్స్ బ్యూరోలో దాదాపు 6 లక్షల మంది నేర చరిత్ర గలవారి వేలిముద్రల నిల్వ ఉంది. గతంలో ఒక్కో వేలిముద్రనూ పరిశీలించాల్సి వచ్చేది. దాంతో పాస్పోర్టు దరఖాస్తుదారుల వేలిముద్రలు పరిశీలించడం సాధ్యమయ్యేది కాదు. కాని ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు చేసిన పాపిలోన్ పరిజ్ఞానం ద్వారా క్షణాల్లో వేలిముద్రలను విశ్లేషించగలుగుతున్నారు. దీని ద్వారా పాస్పోర్టు దరఖాస్తుదారుని వేలిముద్రలను విచారణ అధికారి వద్ద ఉన్న వేలిముద్రల ఉపకరణంపై ఉంచుతారు. తద్వారా దరాఖాస్తుదారుని ఇంటి వద్ద నుంచే ఫింగర్ప్రింట్ బ్యూరోలోని నిల్వతో సరిపోల్చుతారు. ఒకవేళ వీరికి నేర చరిత్ర ఉండి ఉంటే క్షణాల్లో తెలిసిపోతుంది. దాంతో నేరచరిత్ర ఉన్న వారికి పాస్పోర్టు రాకుండా సమర్థంగా అడ్డుకోవచ్చు. 2020లో 94, 2021 జూన్ వరకూ 22 మందిని ఇలా నేరచరితులను గుర్తించగలిగారు. ఇప్పటి వరకూ మొత్తం దరఖాస్తుల్లో కొద్దిమంది నుంచి మాత్రమే వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఇక మీదట ప్రతి ఒక్క దరఖాస్తుదారుడి వేలిముద్రలను ఇలానే పరిశీలించాలని భావిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే పాస్పోర్టు పరిశీలన మరింత పారదర్శకంగా మారుతుందనడంలో సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు. -
వాషింగ్టన్ డీసీలో ఘనంగా తానా (నరేన్ వర్గం) విజయోత్సవ సభ
తానా ఎన్నికల్లో డా.నరేన్ కొడాలి వర్గం నుంచి గెలిచిన అభ్యర్థులంతా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం (మార్చి 23న) సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. -
సింగపూర్లో స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
మార్చి 18న స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సింగపూర్లో నివసించే తెలుగు గాయకులు ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకొన్నారు. -
NATS: డల్లాస్లో వైభవంగా నాట్స్ తెలుగు వేడుకలు
నాట్స్ తెలుగు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్లోని పది వేల మందికిపైగా తెలుగువారు హాజరయ్యారు. -
లండన్లో సీబీఈ అవార్డు అందుకున్న తెలుగు బిడ్డ డా.కన్నెగంటి చంద్ర
నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్ర ప్రతిష్ఠాత్మక ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (సీబీఈ)’ పురస్కారాన్ని అందుకొన్నారు. -
Indra Nooyi: అమెరికాలో వరుస ఘటనలు.. భారత విద్యార్థులకు ఇంద్రానూయీ సూచనలు
అమెరికా (USA)లో ఉన్న భారత విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) పలు సూచనలు చేశారు. -
కూటమిని గెలిపిద్దాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం: ఎన్ఆర్ఐల తీర్మానం
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు ఆదివారం సమావేశమయ్యారు. -
Indian origin Family: అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి
కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు. -
సింగపూర్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
సింగపూర్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. -
న్యూజెర్సీలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్రరాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు. -
న్యూజెర్సీలో ఓఎఫ్ భాజపా ఆధ్వర్యంలో ‘ఛాయ్పే చర్చ’
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు. -
బే ఏరియాలో ‘తెదేపా-జనసేన-భాజపా’కు చెందిన ఎన్ఆర్ఐల ఆత్మీయ సమావేశం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
అమెరికాలో మే 24-26 మధ్య టీటీఏ మహాసభలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. -
సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి సమావేశం
సౌదీ అరేబియాలోని జుబైల్లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది. రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. -
డెట్రాయిట్లో అట్టహాసంగా మహిళా దినోత్సవం
గ్లోబల్ తెలంగాణ సంఘం డెట్రాయిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. -
తానా బోర్డు ఛైర్మన్గా డా.నాగేంద్ర శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్ పదవికి డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. -
TDP - Janasena: షికాగోలో ఘనంగా తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశం
తెదేపా, జనసేన నాయకులు షికాగోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
TANA Foundation: తానా ఫౌండేషన్ ఛైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నికయ్యారు. -
Sporty Divas: ఇండో-గల్ఫ్ త్రోబాల్ ఛాంపియన్షిప్ విజేతగా అమెరికా జట్టు
బహ్రెయిన్లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్’ విజేతగా నిలిచింది.