స్థిరపడటానికే వేదిక.. నమోదుకు లేదు తీరిక
భారతీయుల్లో ఎక్కువ మంది అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు.
అమెరికాలో జననాల నమోదుకు ఎన్ఆర్ఐల నిరాసక్తత
అరబ్ దేశాల్లోని భారతీయుల ఆసక్తి
161 దేశాల్లో 46,475 మంది జననం.. 7,428 మంది కన్నుమూత
‘2019’ వివరాలు వెల్లడించిన జనగణన శాఖ
ఈనాడు, హైదరాబాద్: భారతీయుల్లో ఎక్కువ మంది అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. భవిష్యత్తులోనూ అక్కడే స్థిరపడాలని కలలు కంటుంటారు. ఎట్టకేలకు ఆ కల ఫలించి, ‘ఆశ’యం నెరవేరినా.. అక్కడి భారత రాయబార కార్యాలయాల్లో జననాల సమాచారాన్ని నమోదు చేయించడానికి మాత్రం అమెరికాలోని ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐ) ఆసక్తి చూపడం లేదు. అరబ్ దేశాల్లోని భారతీయ కుటుంబాలు మాత్రం ఈ సమాచారాన్ని ఎక్కువగానే నమోదు చేయిస్తున్నాయి. జనగణన శాఖ.. విదేశాల్లో 2019 సంవత్సరంలో జనన, మరణాలకు సంబంధించి తాజాగా వెల్లడించిన వివరాలు ఇవే అంశాలను స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోని 161 దేశాల్లో నివసిస్తున్న భారతీయ కుటుంబాల్లో 2019, జనవరి 1 నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు సంభవించిన జనన, మరణాల వివరాలను జనగణన శాఖ వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం.. 161 దేశాల్లో 46,475 జననాలు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని భారత రాయబార కార్యాలయంలో అక్కడ నివసించే భారతీయ కుటుంబాలు నమోదు చేయించాయి. ఆ దేశంలో 10,534 శిశువుల జననాలు నమోదయ్యాయి. అత్యల్పంగా సెర్బియా, రొమేనియా, రీయూనియన్ ఐలాండ్, మయన్మార్, మాలీ, గ్వాటిమాలా, కెనడా, అల్జీరియా, స్లోవేనియా దేశాల్లో కేవలం ఒక్కో జననం మాత్రమే నమోదైంది. వాస్తవానికి అరబ్ దేశాలతో పోల్చితే.. అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాలే ఎక్కువ. అయినా.. అక్కడ(అమెరికాలో) జననాల నమోదు చాలా స్వల్పంగా ఉంటుండటం చర్చనీయాంశమవుతోంది. 2019లో అమెరికాలో కేవలం 21 జననాలు, 411 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలోని చికాగో రాష్ట్రంలో భారతీయులు ఎక్కువగా నివసిస్తారు. ఆ రాష్ట్రంలో ఒక్క జననం కూడా భారతీయ రాయబార కార్యాలయంలో నమోదవకపోవడం గమనార్హం. మరణాల వివరాల విషయంలో ఎంతోకొంత మార్పు కనిపిస్తుంది. 70 మంది భారతీయులు (2019లో) మరణించినట్లు నమోదు చేశారు. ఆ దేశంలో అత్యధికంగా న్యూయార్క్లో 174, శాన్ఫ్రాన్సిస్కోలో 132 మంది కన్నుమూసినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
అమెరికా పౌరసత్వం కోరుకుంటున్నందుకే..!
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారత పౌరసత్వం కోరుకునేవారు అక్కడి భారత రాయబార కార్యాలయాల్లో జనన, మరణాలను నమోదు చేయిస్తూ ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్నారు. అమెరికాలో ఉన్న వారు.. అక్కడి పౌరసత్వాన్ని కోరుకుంటున్నందున భారత రాయబార కార్యాలయంలో జననాల వివరాలను పెద్దగా నమోదు చేయించడం లేదు. 2019లో 161 దేశాల్లో మొత్తం 7,428 మంది భారతీయులు వివిధ కారణాలతో కన్నుమూశారు. అందులో అత్యధికంగా సౌదీ అరేబియాలో 2,353, యూఏఈలో 1,410, కువైట్లో 707, బహ్రెయిన్లో 211 నమోదయ్యాయి. ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కువైట్, మలసియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాల్లో 200 నుంచి 4 వేల దాకా జననాలు నమోదయ్యాయి.
బాలుర జననాలే ఎక్కువ..
ఇక్కడి మాదిరిగానే విదేశాల్లోనూ భారతీయుల కుటుంబాల్లో బాలికలకన్నా బాలుర జననాలు ఎక్కువగా ఉంటున్నాయి. మహిళలతో పోల్చితే.. పురుషుల మరణాల నమోదు ఎక్కువగా ఉంటోంది. చాలా దేశాల్లో మరణించింది పురుషులా.. మహిళలా అన్న సమాచారం ఇవ్వడం లేదు. విదేశాల్లో భారతీయ యువతులు తక్కువగా ఉన్నారని, అందుకే అక్కడ పనిచేసే భారతీయ యువకులు పెళ్లి చేసుకోవడానికి మనదేశానికి వస్తున్నారని ఓ అధికారి వివరించారు. విదేశాల్లోని భారతీయ కుటుంబాల్లో బాలికల జననాలు తక్కువగా ఉండటం, చదువుకోవడానికి ఇక్కడి నుంచి ఆ దేశాలకు వెళ్లేవారిలో యువకులే ఎక్కువగా ఉండటంతో అక్కడ భారతీయ మహిళల సంఖ్య తక్కువగా ఉన్నట్లు అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు