Afghanistan: అఫ్గాన్ అంశంపై కలిసి ముందుకెళ్దాం.. భారత్, అమెరికా నిర్ణయం
అఫ్గాన్లో నెలకొన్న తాజా పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి
జైశంకర్కు ఫోన్ చేసిన బ్లింకెన్
వాషింగ్టన్: అఫ్గాన్లో నెలకొన్న తాజా పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్లు మరోసారి చర్చించారు. అఫ్గాన్ విషయంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అఫ్గాన్ రాజధాని కాబుల్ను ఆక్రమించుకున్న క్రమంలో... బ్లింకెన్ సోమవారమే జైశంకర్తో మాట్లాడారు. శుక్రవారం మరోసారి ఫోన్ చేశారు. కాబుల్ విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణ స్థితికి రాగానే... అఫ్గాన్ నుంచి భారతీయులను తీసుకొస్తామని, ఈ విషయమై అమెరికాతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని జైశంకర్ అంతకుముందు వెల్లడించారు.
ధ్రువపత్రాలున్నా తప్పని తిప్పలు...
అఫ్గాన్ను విడిచి వెళ్లాలనుకునే వారికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాలిబన్లు ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేపడుతున్నారు. వారిలో చాలామందికి చదవడం రాదు. దీంతో ధ్రువపత్రాలు ఉన్నా కొంతమందిని అడ్డుకుంటున్నట్టు సమాచారం. అన్ని పత్రాలు ఉన్నా, కాన్సుల్ అధికారుల నుంచి క్లియరెన్స్ రావడం చాలా జాప్యమవుతోంది. దీంతో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట చాలామంది తమవంతు కోసం వేచి చూస్తున్నారు. గతంలో అమెరికా దళాలతో కలిసి పనిచేసినవారైతే... తాము దేశం విడిచి వెళ్లడం ఆలస్యమైతే, తాలిబన్లు తమను లక్ష్యం చేసుకుంటారని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారిలో చాలామంది వద్ద ఎలాంటి పత్రాలూ లేకపోవడం వారిని తీవ్రంగా కలవరపరుస్తోంది.
7 వేల మంది తరలింపు...
ఈనెల 14 నుంచి ఇప్పటివరకు తాము సుమారు 7 వేల మందిని అఫ్గాన్ నుంచి తరలించినట్టు అమెరికా రక్షణశాఖ కార్యాలయం వెల్లడించింది. ‘‘కాబుల్లో ప్రస్తుతం 5,200 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. అక్కడి విమానాశ్రయం మా ఆధ్వర్యంలోనే భద్రంగా ఉంది. రోజూ 5 వేల నుంచి 9 వేల మందిని విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రజలు వచ్చేందుకు వీలుగా విమానాశ్రయంలో మరిన్ని ద్వారాలను తెరిచాం. కానీ, ధ్రువపత్రాల పరిశీలన కొంత జాప్యమవుతోంది. రాయబార సిబ్బందిని పెంచి, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అమెరికా సైనికాధికారి మేజర్ జనరల్ హంక్ టేలర్ చెప్పారు. కాబుల్ విమానాశ్రయంలో ప్రస్తుతం 6 వేల మంది తరలింపునకు సిద్ధంగా ఉన్నట్టు విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు.
బైడెన్ సర్కారు బాధ్యత వహించాలి: రిపబ్లికన్ సెనేటర్లు
బైడెన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే అఫ్గాన్లోని అమెరికా రక్షణ పరికరాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని సుమారు 25 మంది రిపబ్లికన్ సెనేటర్లు విమర్శించారు. ఇందుకు బైడెన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న