దేశం దాటాలంటే పరీక్షలెన్నో!.. ఆంక్షల కఠినతరంతో అయోమయం
యూఏఈ కరోనా ఆంక్షలు సడలించిందని తెలిసి ఓ ఉద్యోగి దుబాయి మీదుగా అమెరికా
ఈనాడు - హైదరాబాద్
యూఏఈ కరోనా ఆంక్షలు సడలించిందని తెలిసి ఓ ఉద్యోగి దుబాయి మీదుగా అమెరికా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఎయిర్పోర్టుకు చేరాక ఆ ఎయిర్లైన్స్ నుంచి వెళ్లే వారికి వీసా ఆన్ అరైవల్ సదుపాయం లేదని ప్రయాణానికి అనుమతించబోమని చెప్పారు. దీంతో ఆ టికెట్ రద్దు చేసుకుని రూ. 1.3 లక్షలు పెట్టి ఎమిరేట్స్ టికెట్ కొనుక్కోవలసి వచ్చింది.
* ఖతార్ వెళ్లేందుకు మరో ప్రయాణికుడు విమానం బయలుదేరే సమయానికి 3 గంటల ముందుగా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో సిబ్బంది విమానం బయలుదేరే సమయానికి 5-6 గంటల ముందుగానే వచ్చి కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని, ఇప్పుడు సమయం లేనందున అనుమతించబోమని చెప్పారు. సమయం మార్చిన విషయం తెలియకపోవడంతో టికెట్ రద్దు చేసుకున్నారు.
వివిధ దేశాల్లో కరోనా ఆంక్షలు, నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర పనులపై స్వదేశానికి వస్తున్నవారికి తిరిగి వెళ్లే సమయంలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. తిరుగు ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా ఎయిర్లైన్స్ సంస్థల నుంచి కనీస సమాచారం అందకపోవడం, మారుతున్న నిబంధనల్ని ప్రయాణికులు తెలుసుకోకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. కరోనా పరీక్ష ప్రమాణాలు, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టు నిబంధనలు తెలియక పలువురు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
భారీగా రుసుం..
ఎయిర్పోర్టులో కరోనా పరీక్ష రుసుంలు భారీగా ఉంటున్నాయి. విమాన ప్రయాణానికి 6 గంటల ముందుగా చేసే ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.4,500 చెల్లించాల్సి వస్తోంది.
ఇలా చేస్తే మేలు..
- అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి వివిధ దేశాలు అమలు చేస్తున్న కరోనా ఆంక్షలు, వీసా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
- ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయం అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు లేదు. అది ముందే తెలుసుకుని టికెట్లు బుక్ చేసుకోవాలి.
- ప్రయాణానికి ముందురోజు విమానయాన సంస్థ కాల్సెంటర్లో సంప్రదించి, నిబంధనల్లో మార్పులేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి
- గతంలోలా ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వనందున అప్రమత్తంగా ఉండాలి.
- కరోనా నిబంధనలు, ఆంక్షల కారణంగా కొన్ని విమానయాన సంస్థలు టికెట్ల రద్దు, తేదీ మార్పులపై చేస్తున్న సవరణలు గమనించడం అవసరం.
ఆంక్షల కఠినతరంతో అయోమయం
అంతర్జాతీయ ప్రయాణికులు రెండుసార్లు కొవిడ్ పరీక్ష చేయించుకోవలసి వస్తోంది. ప్రస్తుతం అన్ని విమానయాన సంస్థలు గమ్యస్థానం చేరుకునే సమయానికి (విమాన ప్రయాణ సమయాన్ని కలుపుకొని) 48 గంటల ముందుగా కొవిడ్ పరీక్ష రిపోర్టుతో రావాలని చెబుతున్నాయి. గతంలో ఇది 48-72 గంటలుగా ఉండేది. ఈ వివరాలు విమానయాన సంస్థల వెబ్సైట్లో అప్డేట్ కావడం లేదు. నిబంధనలు తరచూ మారుతుండడం, వివిధ దేశాలు ఆంక్షలను కఠినం చేస్తుండటంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. కాల్సెంటర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.
6 గంటల ముందు మరోసారి
అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి 6 గంటల ముందు ఎయిర్పోర్టుకు చేరుకోవలసి వస్తోంది. గతంలో గంట ముందు వరకు చెక్-ఇన్కు అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు 3 గంటల ముం దుగానే చెక్-ఇన్ అయిపోవాలని నిబంధన మార్చారు. అలాగే సరైన వీసా ఉంటే చాలు అంతర్జాతీయ ప్రయాణానికి అనుమతి ఉన్నట్లేనని భావించే పరిస్థితి లేదు. ఎయిర్పోర్టుకు చేరుకున్నాక అక్కడి సిబ్బంది ప్రయాణ పత్రాలన్నీ చూసి సత్వర ఆర్టీపీసీఆర్ పరీక్షకు అనుమతి ఇస్తారు. పత్రాల పరిశీలన పూర్తయ్యే వరకు కరోనా పరీక్షకు అనుమతి ఇవ్వరు. ఈ పరీక్ష చేయించుకున్న 45-60 నిమిషాల్లో ఫలితం వస్తుంది. అది అనుకూలంగా ఉంటే చెక్ఇన్కు అనుమతి ఇస్తారు. వ్యతిరేకంగా ఉంటే ప్రయాణ రద్దవుతుంది. ప్రయాణ సమయానికి కనీసం 5 గంటల ముందుగా పరీక్షకు నమూనా ఇవ్వాలని ఎయిర్లైన్స్ సిబ్బంది చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!