లాటరీ విధానంలోనే హెచ్1-బి వీసాల ఎంపిక
హెచ్1-బి వీసాల జారీ నిమిత్తం ట్రంప్ హయాంలో ప్రతిపాదించిన కొత్త విధానాన్ని అమెరికా న్యాయస్థానం కొట్టేసింది! కొన్నేళ్లుగా లాటరీ విధానంలో పరిమితి మేరకు హెచ్-1బి వీసాలను ఎంపిక చేస్తున్నారు.
ట్రంప్ సర్కారు ప్రతిపాదనలను కొట్టేసిన అమెరికా న్యాయస్థానం
వాషింగ్టన్: హెచ్1-బి వీసాల జారీ నిమిత్తం ట్రంప్ హయాంలో ప్రతిపాదించిన కొత్త విధానాన్ని అమెరికా న్యాయస్థానం కొట్టేసింది! కొన్నేళ్లుగా లాటరీ విధానంలో పరిమితి మేరకు హెచ్-1బి వీసాలను ఎంపిక చేస్తున్నారు. ఈ విధానం సరికాదని, వేతన స్థాయిని బట్టి వీటిని జారీ చేయాలని... అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) నాడు ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యతిరేకించింది. దీన్ని కొట్టేయాలంటూ కాలిఫోర్నియా నార్తెర్న్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జాఫ్రీ వైట్ తీర్పు వెల్లడించారు. ‘‘ప్రతిపాదిత ఉత్తర్వులు జారీచేసిన నాటి తాత్కాలిక హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ చాద్ ఓల్ఫ్ చట్టబద్ధంగా వ్యవహరించలేదు. ఆ కారణం వల్ల ఆయన ప్రతిపాదించిన హెచ్1-బి కోటా ఎంపిక ప్రతిపాదనను కొట్టేస్తున్నాం’’ అని జడ్జి పేర్కొన్నారు.
భారతీయులే అధికం...
శాస్త్ర, సాంకేతిక, గణిత, ఇంజినీరింగ్ (స్టెమ్), ఇతర రంగాల్లో దేశీయ సంస్థలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వీలు కల్పిస్తూ.. అమెరికా హెచ్1-బి వీసాలను జారీ చేస్తుంది. వీటి ద్వారా అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేసేవారిలో భారతీయులు, చైనా వారే ఎక్కువ. ఈ వీసాల కోసం ఏటా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. అయితే, సాధారణ విద్యార్హతలున్న నిపుణుల్లో గరిష్ఠంగా 65 వేల మందిని, అదనపు విద్యార్హతలున్న మరో 20 వేల మందిని మాత్రమే హెచ్1-బి వీసాలకు ఎంపిక చేస్తున్నారు. ఇందుకు లాటరీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ట్రంప్ సర్కారు... అధ్యక్ష ఎన్నికలకు ముందు లాటరీ విధానాన్ని తొలగిస్తామని ప్రకటించింది. అమెరికన్ల ప్రయోజనాలను కాపాడుతూనే, అత్యంత నిపుణులైన విదేశీయులకు లబ్ధి చేకూర్చేలా ‘వేతన ఆధార హెచ్1-బి కోటా కేటాయింపు’ చేపడతామని వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాత్కాలిక హోంలాండ్ సెక్రటరీ ఓల్ఫ్ ఉత్తర్వులిచ్చారు. వీటిని 2021, మార్చి 9 నుంచి అమలు చేయాలని యూఎస్సీఐఎస్ పేర్కొంది. అయితే, గడువు తేదీని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ ఏడాది డిసెంబరు 31కి వాయిదా వేసింది. ఓల్ఫ్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, ఆయన ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటుకావని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు.