ఘనంగా ‘24 గంటల ఎస్పీ బాలు స్వర రాగ మహా యాగం’

గాన గంధర్వ, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను స్మరిస్తూ వంశీ- ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ (GIFT),  తెలుగు కళా సమితి ఖతార్ సంయుక్త ఆధ్వర్యంలో

Published : 27 Sep 2021 19:11 IST

గాన గంధర్వ, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను స్మరిస్తూ వంశీ- ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ (GIFT),  తెలుగు కళా సమితి ఖతార్ సంయుక్త ఆధ్వర్యంలో ‘24 గంటల ఎస్పీ బాలు స్వర రాగ మహా యాగం’  అంతర్జాలం వేదికగా ఘనంగా జరిగింది.  సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై 25వ తేదీ ఉదయం 10 గంటలకు స్వర రాగ మహా యాగం పూర్తయింది.

ఖతార్  వేదికగా ఈ కార్యక్రమాన్ని ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ పద్మజ జ్యోతి ప్రకాశం చేసి  ప్రారంభించారు. వంశీ సంస్థల అధినేత డాక్టర్ వంశీ రామరాజు, తాతాజీ ఉసిరికల, తెలుగు కళా సమితి అధ్యక్షులు మాట్లాడుతూ, ఏదైనా ఒక విశ్వవిద్యాలయంలో సంగీత విభాగంలో ఎస్పీ బాలు బాలు పేరిట ఎంఏ మ్యూజిక్‌లో అత్యుత్తమ స్థానం పొందినవారికి స్వర్ణ పతకాన్ని నెలకొల్పుతామని తెలియజేశారు.

సభా ప్రారంభకులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారులు డా. కె.వి.రమణ మాట్లాడుతూ ‘బాల సుబ్రహ్మణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని  సంకల్పం, కృషి, దీక్ష ,తపన, రాజీ లేని తత్వం, ఒడిసిపట్టి ఎదిగే నైపుణ్యం - ఈ సప్తగుణాలన్నీ  కలిసి ఆయన గొంతులో సప్తస్వరాలుగా  ప్రతిష్ఠితమైనాయి’ అన్నారు. ‘ఆయన పాటలే ఆ సప్తస్వరాల వైభవాన్ని చెప్పాయి’ అంటూ గాన గంధర్వునితో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు. ఎస్పీ బాలు ఐసీయూలో వెళ్లే రెండు రోజుల ముందు తనకు పెట్టిన వాయిస్ మెయిల్ ఈ సందర్భంగా వినిపించారు ప్రముఖ వైద్యులు గురువారెడ్డి. ఆ తర్వాత ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్పీ బాలుతో తమకున్న అనుబంధం గురించి సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, తనికెళ్ళ భరణి, సాలూరి వాసు రావు, రేలంగి నరసింహారావు, భువనచంద్ర,  డా వంగూరి చిట్టెన్ రాజు, కె స్వరూపా రెడ్డి, శారద ఆకునూరి, కేఎస్‌ ప్రసాద్‌(ఐసీసీ అడ్వైజరీ కౌన్సిల్ ఖతార్) , శ్రీదేవి జాగర్లమూడి(తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ న్యూజెర్సీ) సత్యాదేవి మల్లుల(మలేషియా), రత్న కుమార్ కవుటూరు(అధ్యక్షులు శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్), డా తెన్నేటి సుధ( అధ్యక్షురాలు వంశీ), శైలజ సుంకరపల్లి(మేనేజింగ్ ట్రస్టీ వంశీ), డాక్టర్ ఇప్పనపల్లి (ఛైర్మన్ లీడ్ ఇండియా ఫౌండేషన్ అమెరికా), డా రామరాజు శ్రీనివాసరావు (ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ టాక్స్ ప్రాక్టీషనర్ అండ్‌ కన్సల్టెంట్ అసోసియేషన్ గుంటూరు), రాధిక నోరి (అమెరికా, ప్రముఖ గాయని) శశికళ స్వామి(వైణిక విద్వాంసురాలు) రామరాజు లక్ష్మీ శ్రీనివాస్, కొమ్మరాజు ప్రసాద్(అమెరికా), కుమార్ రాణి (న్యూ జెర్సీ), రేవంత్ చిలకమర్తి(కెనడా), మధువాణి వడ్లమాని(కెనడా), అనిల్ కుమార్(ఒమన్), ఆదిత్య వెలిచెర్ల (ఆస్ట్రేలియా), మనోహర్ ఎల్లా (ఆస్ట్రేలియా), శ్రీలత మగతల (న్యూజిలాండ్), రమ (ఆస్ట్రేలియా), పద్మ మల్లెల, గోవర్ధన్ మల్లెల(న్యూజిలాండ్) వి.హరి శ్రీనివాస్(బెంగళూరు), రాజశేఖర్ వెలపూరు(అమెరికా), మోహన్ విస్సాప్రగడ(ఖజికిస్తాన్), వి.ఎస్.మూర్తి(కెనడా), గంటా ప్రసాద్ (అమెరికా),ప్రముఖ గాయని వి.కె. దుర్గ, ఉషా చివుకుల(అమెరికా)పి.బి. సాహితి(చెన్నై) ,త్రినాథరావు(అమెరికా) సహా ఐదు ఖండాల నుంచి ఎందరో ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొని బాలు గారికి ఘన నివాళి అర్పించారు.

ఐదేళ్ల బాలిక నుంచి 90 ఏళ్ల వయస్సు గల గాయని వరకూ తమ గానాన్ని వినిపించారు. 24 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలుకు స్వరాభిషేకం చేశారు. ఒక గంట సేపు ఈల పాట ద్వారా డా.విద్యాసాగర్, ఆయన బృందం పాడిన గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారికి వంశీరామరాజు ‘ఎస్పీబాలు ఇంటర్నేషనల్ అవార్డు’ ప్రకటించారు. యూకే నుంచి ఎస్పీ బాలు పాటలు పాడిన ఆదిత్య శివానంద మల్లాది అనే గాయకుడిని  స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో ప్రోత్సహించాలని ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు ప్రకటించారు. వ్యాఖ్యాతలుగా ఖతార్‌కు చెందిన బి భవాని, బి గౌరీదేవి, కె సాహిత్య జ్యోత్స్న, మాధవి బైటారులు వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని