తానా మాతృభాష సాహిత్య సదస్సు విజయవంతం
అట్లాంటా, జార్జియా: ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా..ఆంగ్లభాషపై ఎంత పట్టున్నా.. మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదని పలువురు సివిల్ సర్వీసెస్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నెలనెలా తెలుగు వెలుగు’ సాహిత్య సమావేశం సెప్టెంబర్ 26న విజయవంతంగా జరిగింది. తానా పాలక మండలి అధిపతి డా.బండ్ల హనుమయ్య తన స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర ఈ 18వ అంతర్జాతీయ దృశ్య మాద్యమం ద్వారా ‘వ్యక్తిత్వ వికాస మార్గం మాతృభాష’ అనే అంశంపై తమ అభిప్రాయాలు చెప్పేందుకు అతిథులను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పలువురు సివిల్ సర్వీసెస్ అధికారులు మాట్లాడుతూ.. పిల్లలు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో చదువుకోవడం వల్ల వారికి అవగాహనా శక్తి పెరుగుతుందన్నారు. ఒక మంచి పునాది ఏర్పడి ఆలోచనా విధానం మెరుగుపడుతుందని తెలిపారు. అవసరాన్ని బట్టి ఎన్ని భాషలనైనా సులభంగా నేర్చుకోగలుగుతారని పేర్కొన్నారు. నేటి ప్రపంచంలో ఆంగ్ల భాషకున్న ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని, అయితే తెలుగు భాష పట్ల నిర్లక్ష్యం తగదని చెప్పారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన సివిల్ సర్వీస్ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ అవసరాన్ని బట్టి తెలుగు నేర్చుకుంటున్నారని తెలిపారు. పసితనంలో మాతృభాషలో చదువుకున్న వారి మానసిక వికాసం మెరుగ్గా ఉంటుందనే విషయాన్ని మానసిక శాస్త్రవేత్తలు ధ్రువీకరించారని అన్నారు. ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు, సంస్థలు, విద్యాలయాలు, తల్లిదండ్రులు, తెలుగు భాషాభిమానులు అందరూ కలసి పిల్లలకు బాల్యదశ నుంచి తెలుగు భాషపై అవగాహన, ఆసక్తి పెంపొందించే దిశగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి, మాజీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కంటాక్స్ మేడిశెట్టి తిరుమల కుమార్, జిల్లా మాజీ కలెక్టర్ నందివెలుగు ముక్తేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ (తమిళనాడు) పోలూరి రాజేశ్వరి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (పశ్చిమ్బెంగాల్) డా.బొప్పూడి నాగరమేష్, మాజీ చీఫ్ ఇన్కంటాక్స్ కమిషనర్ గాది వేణుగోపాలరావు, ఈడీ టొబాకో బోర్డు (గుంటూరు) అద్దంకి శ్రీధర్బాబు, విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డా.కరణం అరవిందరావు, డా.పట్నాల సుధాకర్, విద్యావేత్త, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Liger: మరికొన్ని గంటల్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్ మీట్.. వేదిక మార్చేసిన టీమ్
-
Sports News
Dravid - Taylor : అడవిలో 4000 పులులు .. కానీ ఇక్కడ ద్రవిడ్ మాత్రం ఒక్కడే!
-
India News
RSS chief: యావత్ ప్రపంచం భారత్వైపే చూస్తోంది : మోహన్ భగవత్
-
Movies News
Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
-
Politics News
Raghunandan: ఏ చట్టం ప్రకారం మంత్రి కాల్పులు జరిపారు?: రఘునందన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్ఝున్వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- RRR: ఆస్కార్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)